తెలంగాణ

telangana

ETV Bharat / state

REVANTH REDDY: చంద్రబాబును అప్పుడెందుకు పొగిడినవ్.. కేటీఆర్​ ఎట్ల గెలిచిండో యాదికిలేదా? - తెలంగాణ వార్తలు

రూ.లక్షా.25 వేల కోట్లు ఖర్చు పెట్టినట్లు బిల్లులు చూపించి కల్వకుర్తి నుంచి శ్రీరాంసాగర్ వరకు ఏడేళ్లలో ఒక్క పని పూర్తి చేయలేదని టీపీసీసీ చీఫ్​ రేవంత్ రెడ్డి​ ఆరోపించారు. కేసీఆర్ ఏడేళ్ల పాలనలో నీటిపారుదల ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయలేదని ఆయన ప్రశ్నించారు. నిజామాబాద్ జిల్లా​ రైతుల వల్లే తనకు పీసీసీ పదవి దక్కిందని రేవంత్​రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణకు కేసీఆర్ ద్రోహం చేశారని... చంద్రబాబు ఏం చేశారని రేవంత్ అన్నారు. రాష్ట్రంతో సంబంధం లేని చంద్రబాబును తిట్టాలా? లేక ప్రజలను వంచిస్తున్న చంద్రశేఖర్​రావును తిట్టాలా? అని ప్రశ్నించారు.

tpcc-chief-revanth-reddy-comments-on-cm-kcr
tpcc-chief-revanth-reddy-comments-on-cm-kcr

By

Published : Aug 29, 2021, 4:08 PM IST

Updated : Aug 29, 2021, 5:22 PM IST

కేసీఆర్ ఏడేళ్ల పాలనలో నీటిపారుదల ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయలేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి ప్రశ్నించారు. హైదరాబాద్‌ కొంపల్లిలోని పీఎస్‌ఆర్‌ కన్వెన్షన్‌ హాల్లో బోధన్‌ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో తెరాస ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రూ.లక్షా 25 వేల కోట్లు ఖర్చు పెట్టినట్లు బిల్లులు చూపించి.. కల్వకుర్తి నుంచి శ్రీరాంసాగర్ వరకు ఏడేళ్లలో ఒక్క పని పూర్తి చేయలేదన్నారు. ప్రభుత్వం ఏర్పాటైన తొలి మూడేళ్లలోనే ప్రాజెక్టులు పూర్తి చేసి ఉంటే ఈరోజు ఏపీ ముఖ్యమంత్రి జగన్​కు తెలంగాణపై ఫిర్యాదు చేసే అవకాశం వచ్చేది కాదు కదా అని అన్నారు. కమీషన్ల కోసం ప్రాజెక్టులను కాలగర్భంలో కలిపేశారని ఆరోపించారు. తెరాస పాలనలో రాష్ట్రంలోని ప్రాజెక్టుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందన్నారు.

ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని నాడు శాసనసభలో జానారెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి సూచించిన విషయాన్ని గుర్తుచేశారు. ఐదేళ్ల క్రితం జనారెడ్డి ఏ మాట చెప్పారో ఈ రోజు ఆ పరిస్థితులే ఉన్నాయని విమర్శించారు. అప్పుడే చివరి దశకు వచ్చిన ప్రాజెక్టులు పూర్తి చేసి ఉంటే ఇవాళ ఏపీ సీఎం జగన్​ ఫిర్యాదు చేసే అవకాశం వచ్చేది కాదన్నారు. కేసీఆర్ కృష్ణా బోర్డు మీటింగ్​కు ఎందుకు హాజరుకావడం లేదని రేవంత్​ రెడ్డి ప్రశ్నించారు. జగన్మోహన్​ ​రెడ్డి జలదొంగ అయితే.. పోతిరెడ్డిపాడు, సంగమేశ్వర, రాయలసీమ ఎత్తిపోతలపై బోర్డు సమావేశానికి వెళ్లి జగన్​ను నిలదీయాలని కానీ ఎందుకు వెళ్లడం లేదన్నారు. తెరాస ఓటమి ఖాయమైంది కాబట్టే కేసీఆర్ ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టడానికి చూస్తున్నారని ఆరోపించారు.

జగన్​తో అలయ్​బలయ్ చేసుకుంది కేసీఆర్ కాదా అంటూ విమర్శించారు . వైసీపీ ఎమ్మెల్యే రోజా ఇంటికి వెళ్లి భోజనం చేసి.. రాయలసీమకు నీళ్లిస్తా అని చెప్పింది కేసీఆరే కదా అని మండిపడ్డారు. బేసిన్​లు బేషజాలు లేవంటూ జగన్​తో సఖ్యతగా సీఎం కేసీఆర్​ మెలిగారంటూ రేవంత్​ గుర్తు చేశారు. బేసిన్​లు, బేషజాలు లేకుంటే ఇంతమంది తెలంగాణ సోదరుల ఆత్మబలిదానాలు ఎందుకు? రాష్ట్రం తెచ్చుకుందే నీళ్లు, నిధులు, నియామకాల కోసమే కదా అంటూ ప్రశ్నించారు. ఈ రోజు అదే నీటి విషయంలో అన్యాయం జరుగుతోందని రేవంత్​ రెడ్డి అన్నారు.

బాబును విజయవాడలో కలిసి రాష్ట్ర పరిస్థితులు వివరించా. చంద్రబాబుకు నమస్కారం పెట్టి.. తెలంగాణ బిడ్డలు, రైతాంగం కన్నీళ్లలో మునిగితేలుతున్నారని.. కాబట్టి పార్టీని వీడటం తప్పలేదని గౌరవంగా పరిస్థితులను వివరించి కాంగ్రెస్​లో చేరా. లబ్ధిపొందాలని అనుకుంటే ప్రతిపక్షమైనా కాంగ్రెస్​ పార్టీలో ఎందుకు చేరతా? పార్టీ మారితే ఇష్టం వచ్చినట్లు మాట్లడలేను. కార్యకర్తల వల్లే ఇంతవాడిని అయ్యాను. రాష్ట్రానికి పట్టిన గులాబీ చీడ విరగడ కోసమే కాంగ్రెస్​లో చేరా. సిరిసిల్లలో కేటీఆర్ గెలిచింది తెదేపా కార్యకర్తల సహకారంతోనే కదా. హైటెక్​ సిటీ అభివృద్ధిని వివరిస్తూ చంద్రబాబును పోటీపడి పొగిడింది మీరేగా. చంద్రబాబును తిట్టాల్సిన అవసరం ఏముంది? - రేవంత్​రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు.

చంద్రబాబును అప్పుడెందుకు పొగిడినవ్.. కేటీఆర్​ ఎట్ల గెలిచిండో యాదికిలేదా?

చంద్రబాబును నువ్వెందుకు పొగిడినవ్.. కేటీఆర్​ ఎట్ల గెలిచిండో మరిచినవా?

తెలంగాణలో చంద్రబాబుకు పార్టీ లేదు.. ప్రణాళిక లేదని రేవంత్​రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజల కోసం పనిచేయడానికే తెదేపా నుంచి బయటకు వచ్చానని వివరించారు. రాజకీయం విలువను గౌరవిస్తున్నానన్న రేవంత్.. చంద్రబాబును ఎందుకు తిట్టాలని ప్రశ్నించారు. తిట్టలేదు కాబట్టి తనను బాబు మనిషి అంటున్నారని చెప్పుకొచ్చారు. తెలంగాణకు బద్ధ వ్యతిరేకి అని రాజశేఖరరెడ్డిని తిట్టి.. జగన్​తో సఖ్యతగా ఉంది మీరు కాదా అని ప్రశ్నించారు. జగన్​ను​కు కాళేశ్వరం ప్రారంభోత్సవానికి సీఎం కేసీఆర్ ఆహ్వానించిన విషయాన్ని గుర్తుచేశారు.

తెలంగాణతో సంబంధంలేని చంద్రబాబును తిట్టాలా? మన కష్టాలకు కారణమైన కేసీఆర్​ను తిట్టాలా?. మన దుష్మన్ కేసీఆర్​ కదా. అందుకే వారికి వ్యతిరేకంగా పోరాడుతున్నా. నేను సోనియాగాంధీ మనిషిని, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని. తెరాసకు నువ్వు అధ్యక్షుడివి అయితే.. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి టీపీసీసీ అధ్యక్షుడిని నేను. పీసీసీ అధ్యక్షుడిని అని గర్వంగా ఫీల్ అవుతా -రేవంత్​రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు.

అందువల్లే పీసీసీ వచ్చింది..

నిజామాబాద్​ జిల్లా ఆర్మూర్​లో రాజీవ్​ రైతు భరోసా దీక్ష చేపట్టి విజయవంతం చేయటం ద్వారానే దిల్లీ కాంగ్రెస్​ పెద్దలకు తనపై ఓ నమ్మకం ఏర్పడిందని రేవంత్​రెడ్డి పేర్కొన్నారు. పీసీసీ చీఫ్​గా రేవంత్​రెడ్డిని నియమిస్తే.. కాంగ్రెస్​ శ్రేణులంతా కలిసికట్టుగా పని చేసుకుంటారన్న భరోసా వారికి ఏర్పడిందని తెలిపారు. రైతుల పక్షాన కాంగ్రెస్​ పోరాడాలని జిల్లా రైతాంగమంతా కదిలొచ్చిన విషయం కాంగ్రెస్​ అధిష్ఠానం దృష్టిలో పడిందన్న రేవంత్​రెడ్డి.. రైతులంతా కదిలొచ్చి రాజీవ్​ రైతు దీక్షను విజయవంతం చేయడంతోనే తనకు పీసీసీ పదవి వచ్చిందని స్పష్టం చేశారు.

టీపీసీసీ అధ్యక్షుడి ఎంపిక విషయంలో కాంగ్రెస్​ అధినేత్రి సోనియా గాంధీ కీలక నిర్ణయం తీసుకుంటే.. అందుకు రాహుల్​గాంధీ అండగా నిలబడ్డారని రేవంత్​ పేర్కొన్నారు. పార్టీ​ శ్రేణులను ముందుకు నడిపించాలని రాహుల్​ గాంధీ తనతో చెప్పారన్నారు. ఈ సందర్భంగా కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచిన కార్యకర్తలకు రేవంత్​ ధన్యవాదాలు తెలిపారు.

నిజామాబాద్​ రైతుల్లో ముందుండి నడిపించే శక్తి, తత్వం ఉన్నాయని రేవంత్ పేర్కొన్నారు. అలాంటి రైతులను మోసం చేసి.. మూతబడ్డ బోధన్​ షుగర్​ ఫ్యాక్టరీని 100 రోజుల్లో తెరిపిస్తామని హామీ ఇచ్చి ఎన్నికల్లో గెలిచిన కల్వకుంట్ల కవితను రైతులంతా కంకణం కట్టుకుని మరీ ఓడించారని గుర్తు చేశారు. మీ పట్టుదల ముందు ప్రభుత్వ పెద్దలు తలవంచక తప్పలేదన్న ఆయన.. కాంగ్రెస్​ పట్ల ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడేవారికి బుద్ధి చెప్పాలన్నారు

ఇదీ చదవండి: DEVADULA PROJECT: కాళేశ్వరం, దేవాదులతో ఉమ్మడి వరంగల్ సస్యశ్యామలం: ఎర్రబెల్లి

Last Updated : Aug 29, 2021, 5:22 PM IST

ABOUT THE AUTHOR

...view details