తెలంగాణ

telangana

ETV Bharat / state

అక్షరాభ్యాసం కోసం బాసర వెళ్తూ... అనంతలోకాలకు

కామారెడ్డి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. సదాశివనగర్​ మండలం అడ్లూరులో అదుపుతప్పిన కారు డివైడర్​ను దాటి అవతలి రోడ్డులో వస్తున్న లారీని ఢీకొట్టింది.  కారు బలంగా ఢీ కొనడం వల్ల లారీలోని డీజిల్​ ట్యాంక్​ పగిలి మంటలు వ్యాపించగా.. లారీ పూర్తిగా దగ్ధమైంది.

By

Published : Jun 27, 2019, 9:50 AM IST

కామారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం

కామారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం
కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సదాశివనగర్ మండలం అడ్లూరు ఎల్లారెడ్డి క్రాసింగ్ వద్ద జాతీయ రహదారిపై అదుపుతప్పిన కారు ఎదురుగా వస్తున్న లారీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మరణించగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. రాకేష్​ అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్​ నుంచి బాసర ఆలయంలో అక్షరాభ్యాసం కోసం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. రాకేష్​ బావ మరిది, రాకేష్​ భార్య, అత్తమ్మ అక్కడికక్కడే మృత్యవాత పడ్డారు. రాకేష్​కు కుడి భుజం విరిగగా.. తన మూడేళ్ళ కుమారుడు అభిరామ్ కు స్వల్ప గాయాలు అయ్యాయి. వారిని కామారెడ్డిలోని ఆస్పత్రికి తరలించారు. కారు అదుపు తప్పి డివైడర్​ను దాటి అవతలి పక్క రోడ్డులో ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టడం వల్ల ప్రమాదం చోటుచేసుకుంది. లారీ డీజిల్ ట్యాంక్ పగిలి మంటలు వ్యాపించి పూర్తిగా దగ్ధమైంది. అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేశారు. బాధితులు హైదరాబాద్​లోని వనస్థలిపురంలో నివాసం ఉంటున్న గుంటూరు వాసులుగా గుర్తించారు.

ABOUT THE AUTHOR

...view details