అధిక ధరలకు సరుకులు విక్రయిస్తున్న ఓ కిరాణా దుకాణాన్ని పౌర సరఫరాల అధికారులు సీజ్ చేశారు. నిజామాబాద్ మాలపల్లిలోని కిరాణా షాపులో ధరలు పెంచి సరుకులు విక్రయిస్తున్నారని హెల్ప్ లైన్ నంబర్కు వినియోగదారులు ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు, పౌర సరఫరాల అధికారులు కలిసి తనిఖీ నిర్వహించారు. అధిక ధరలకు విక్రయిస్తున్నారని తేలినందున అధికారులు ఆ దుకాణాన్ని సీజ్ చేశారు.
అధిక ధరలకు విక్రయిస్తున్న కిరాణా షాపు సీజ్ - నిజామాబాద్ వార్తలు
నిజామాబాద్లో అధిక ధరలకు నిత్యావసర వస్తువులు విక్రయిస్తున్న ఓ కిరణా దుకాణాన్ని పౌర సరఫరాల అధికారులు సీజ్ చేశారు. హెల్ప్లైన్ నంబర్కు వినియోగదారులు ఫిర్యాదు చేయడం వల్ల రంగంలోకి దిగిన అధికారులు షాపును మూసివేశారు.
అధిక ధరలకు విక్రయిస్తున్న కిరాణా షాపు సీజ్
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా లాక్ డౌన్ కొనసాగుతున్నందున దుకాణదారులు ఎవ్వరూ అధిక ధరలకు సరుకులు విక్రయించొద్దని ఒకటో పట్టణ సీఐ ఆంజనేయులు విజ్ఞప్తి చేశారు. నిబంధనలు బేఖాతరు చేస్తే దుకాణం సీజ్ చేయడంతోపాటు జైలుకు వెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించారు.