నిజామాబాద్ జిల్లాకు మొదటి శ్రామిక్ రైలు రానుంది. కార్మికులు, యాత్రికులు, విద్యార్థులు ముంబయి నుంచి నిజామాబాద్, కరీంనగర్ జిల్లాకు రానున్నారు. వలస కార్మికులను తరలించేందుకు కేంద్రం శ్రామిక్ రైళ్లను నడుపుతోంది. ఇందులో భాగంగా ముంబయి నుంచి నిన్న రాత్రి 9 గంటలకు బయల్దేరిన శ్రామిక్ రైలు.. నిజామాబాద్ కు మధ్యాహ్నం 2గంటల తర్వాత రానుంది. మొత్తం 1,725మంది ప్రయాణికులతో అక్కడి నుంచి బయలు దేరినట్లు అధికారులు వెల్లడించారు.
ప్రత్యేక బస్సుల ద్వారా.. స్వస్థలాలకు
ఇందులో నిజామాబాద్ జిల్లాకు చెందిన వారు 482 మంది ఉన్నారు. నిజామాబాద్ తో పాటు జగిత్యాల, కరీంనగర్ లోనూ ఈ రైలు ఆగుతుంది. నారాయణపేట, గద్వాల జిల్లాలకు చెందిన వలస కార్మికులు నిజామాబాద్ లోనే దిగనున్నారు. ఇక్కడి నుంచి ప్రత్యేక బస్సుల ద్వారా వారిని సొంత జిల్లాలకు పంపనున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన వారిని జగిత్యాల, కరీంనగర్ లలో దింపనున్నారు.