తెలంగాణ

telangana

బోధన్​లో తోపులాట.. స్పృహ కోల్పోయిన కార్మికురాలు

By

Published : Nov 6, 2019, 3:26 PM IST

బోధన్​లో ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉద్రిక్తంగా మారింది. పోలీసులకు మహిళా కార్మికులకు మధ్య జరిగిన స్వల్ప తోపులాటలో ఒకరు స్పృహ కోల్పోయారు.

స్పృహ కోల్పోయిన కార్మికురాలు

బోధన్​లో స్వల్ప ఉద్రిక్తత
నిజామాబాద్ జిల్లా బోధన్​లో కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉద్రిక్తంగా మారింది. ఇవాళ తలపెట్టిన రాస్తారోకోలో పోలీసులకు, మహిళా కార్మికులకు మధ్య స్వల్ప తోపులాట జరిగింది. ఈ ఘటనలో కొందరి చేతులకు గాయాలయ్యాయి.

రైల్వే గేటు వద్ద నుంచి పోలీస్​ స్టేషన్ వరకు మహిళా కార్మికులు నడుచుకుంటూ వచ్చారు. అందులో ఒక కార్మికురాలు స్పృహ కోల్పోవడం వల్ల ఆస్పత్రికి తరలించారు.

ABOUT THE AUTHOR

...view details