sarojanamma social service in nizamabad: నిజామాబాద్ జిల్లా బోధన్కి చెందిన దంపతులు వెంకట్రావు, సరోజనమ్మ. వెంకట్రావునిజాం షుగర్స్లో ఉద్యోగిగా పనిచేయగా సరోజనమ్మ ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహించేవారు. ఆర్థికంగా ఏఇబ్బంది లేకున్నా సంతానం లేరనే లోటు ఉండేది. దత్తత ప్రయత్నాలు చేసినా అవేమీ సాధ్యపడలేదు. సరోజనమ్మ పాతికేళ్ల కింద రిటైర్ అయ్యారు. వచ్చిన డబ్బుతో ఓ ఇల్లు కొన్నారు.
విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో భర్త మరణించారు. అంతవరకూ తోబుట్టువుల పిల్లలే తనపిల్లలు అనుకొని కాలం గడిపారు. ఆస్తిచూసి ప్రేమ చూపిస్తున్నారని తెలిసి బాధపడిన సరోజనమ్మ.. అవన్నీ చూసి విసిగిపోయింది.. ఇంటిని ఏదైనా సంస్థకు విరాళంగా ఇవ్వాలనుకుంది. ఆ సమయంలో విశ్రాంత ఉపాధ్యాయులు పడుతున్న బాధలు ఆమెను కదిలించాయి.
విశ్రాంత ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘానికి సొంత భవనం లేదని తెలిసి తన తర్వాత ఇల్లు సంఘానికి చెందేలా ఏడాదిన్నర కింద రిజిస్ట్రేషన్ చేశారు. ఆ ఇంటి విలువ ప్రస్తుతం రెండు కోట్లు ఉంటుంది. విషయం తెలుసుకున్న బంధువులు సరోజనమ్మ ఇంటి వైపు రావడం మానేశారు.
ఓసారి దగ్గరి బంధువు చనిపోతే అంతక్రియలకు వెళ్లినప్పుడు ఇంటికి కాస్త దూరంగా శవాన్ని ఉంచారు. విషయం ఆరాతీయగా.. ఆ ఇంటి యజమాని అనుమతించలేదని తెలిసింది. ఇంకోసారి పరిచయస్థుల్లో ఒకరు చనిపోతే వారుండే ఇంటికి దూరంలో అంత్యక్రియలకు కావాల్సిన పనులు చేస్తున్నారు. అద్దె ఇళ్లలో ఉన్నవారికి ఆ బాధలు తప్పట్లేదని సరోజనమ్మకు అర్ధమైంది.