తెలంగాణ

telangana

By

Published : Feb 25, 2021, 9:12 PM IST

ETV Bharat / state

'పంచాయతీ కార్మికులతో ప్రభుత్వం వెట్టి చాకిరి చేయించుకుంటోంది'

నిజామాబాద్ కలెక్టరేట్​ ఎదుట తెలంగాణ ప్రగతిశీల గ్రామపంచాయతీ వర్కర్స్ ధర్నా నిర్వహించారు. జీవో నంబర్ 2026ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గ్రామాల్లో వెట్టి చాకిరి చేయించుకుంటున్నారని ఆరోపించారు.

Telangana Pragathishila  Gram Panchayat Workers held a dharna in front of the Nizamabad Collectorate
నిజామాబాద్ కలెక్టరేట్​ ఎదుట గ్రామపంచాయతీ కార్మికుల ధర్నా

ప్రభుత్వ పాఠశాలల పరిసరాలు శుభ్రం చేయాలని తీసుకొచ్చిన జీవో నంబర్ 2026ను వెంటనే రద్దు చేయాలని ఐఎఫ్​టీయూ నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్.దాసు డిమాండ్ చేశారు. గ్రామాల్లో స్వచ్ఛ భారత్, స్వచ్ఛ తెలంగాణ పెట్టి పంచాయతీ కార్మికులతో ప్రభుత్వం వెట్టి చాకిరి చేయించుకుంటోందని ఆరోపించారు.

అన్యాయం..

తెలంగాణ ప్రగతిశీల గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. కార్మికులు దేవుళ్లతో సమానమన్న ముఖ్యమంత్రి.. వాళ్లకే అన్యాయం చేసే జీవోలు తీసుకు రావడం సిగ్గుచేటని ఎద్ధేవా చేశారు.

హేయమైన చర్య..

ప్రభుత్వ పాఠశాలల మరుగుదొడ్లనూ పంచాయతీ కార్మికులే శుభ్రం చేయాలని నిబంధన తీసుకురావడం హేయమైన చర్యని విమర్శించారు. గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా సహాయ కార్యదర్శి జేపీ గంగాధర్, ఐఎఫ్​టీయూ నగర అధ్యక్షుడు ఎల్బీ రవి, యూనియన్ నాయకులు సుంకర శ్రీనివాస్, న్యవనంది రాజన్న, చొప్పరి గంగాధర్, వెంకటాపూర్ గంగారం, గంగక్క పాల్గొన్నారు.

ఇదీ చూడండి:'ఆ బిల్లులు రైతుల పాలిట వరాలు కాదు... శాపాలు'

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details