తెలంగాణ

telangana

ETV Bharat / state

ఉమ్మడి నిజామాబాద్​ జిల్లాలో కట్టుదిట్టంగా లాక్‌డౌన్​ అమలు - మంత్రి వేముల ప్రశాంత్​ రెడ్డి తాజా వార్తలు

ఉమ్మడి నిజామాబాద్​ జిల్లాలో లాక్‌డౌన్​ కట్టుదిట్టంగా అమలవుతోంది. నిత్యావసర సరకుల కోసం మధ్యాహ్నం ఒంటిగంట వరకే అనుమతి ఉండగా.. అకారణంగా రోడ్లపైకి వచ్చిన వాహనాలను పోలీసులు సీజ్​ చేశారు. నిజామాబాద్​, కామారెడ్డి జిల్లాల్లో కొత్తగా కరోనా కేసులు నమోదు కాలేదు. మంత్రి వేముల ప్రశాంత్​ రెడ్డి ఈ జిల్లాల్లో వేర్వేరుగా సమీక్షించారు.

ఉమ్మడి నిజామాబాద్​ జిల్లాలో కట్టుదిట్టంగా లాక్‌డౌన్​ అమలు
ఉమ్మడి నిజామాబాద్​ జిల్లాలో కట్టుదిట్టంగా లాక్‌డౌన్​ అమలు

By

Published : Apr 24, 2020, 8:29 PM IST

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో లాక్ డౌన్ కొనసాగుతోంది. నిత్యావసర సరకులు, కూరగాయల కోసం మధ్యాహ్నం ఒంటి గంట వరకే అనుమతి ఉంది. నిజామాబాద్ జిల్లాలో రెండు రోజుల నుంచి కొత్త కేసులు రాలేదు. రాష్ట్ర రోడ్లు, భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నిజామాబాద్, కామారెడ్డి జిల్లా కేంద్రాల్లో వేర్వేరుగా సమీక్ష నిర్వహించారు. కరోనా నియంత్రణ, ధాన్యం కొనుగోళ్లపై అధికారులతో చర్చించారు.

నిజామాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి ఇందల్వాయి టోల్ ప్లాజాను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కరోనా కట్టడి చర్యలను పరిశీలించారు. డిచ్​పల్లి, ఇందల్వాయి మండలాల్లో ని కొనుగోలు కేంద్రాల్లో తీసుకుంటున్న జాగ్రత్తలు పరిశీలించారు.

కామారెడ్డి జిల్లాలో పది రోజుల నుంచి కొత్త కేసులు రాలేదు. మద్నూర్ మండల కేంద్రంలో కొవిడ్​ను నియంత్రించాలని పోచమ్మ గుడిలో భక్తులు పూజలు చేశారు. రెండు జిల్లాల్లోని రెడ్ జోన్ ప్రాంతాల్లో కట్టుదిట్టంగా లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. అకారణంగా రోడ్లపైకి వచ్చిన వాహనాలను పోలీసులు సీజ్ చేస్తున్నారు.

ఇదీ చూడండి:'వేసవిలో భారత్​ కరోనాను జయించొచ్చు!'

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details