భారత సరిహద్దుల్లో ఉగ్రవాదులతో పోరాడి వీరమరణం పొందిన నిజామాబాద్ వాసి జవాను ర్యాడ మహేశ్(Martyr Soldier Mahesh) కుటుంబానికి సర్కారు భరోసానిచ్చింది. ఆయన కుటుంబానికి రూ. 50లక్షలు, 300 గజాల ఇంటి స్థలం, మహేశ్ భార్యకు రిజిస్ట్రేషన్ శాఖలో జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగం కేటాయించింది.
మహేశ్(Martyr Soldier Mahesh) గతేడాది నవంబరు 8వ తేదీన దేశ సరిహద్దులో విధులు నిర్వర్తిస్తూ అమరుడయ్యారు. నేడు ఆయన ప్రథమ వర్థంతి సందర్భంగా మహేశ్ స్వగ్రామం నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం కోమన్పల్లిలో జవాను విగ్రహాన్ని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి వందలాదిగా యువకులు వేల్పూర్ నుంచి కోమన్పల్లి వరకు ర్యాలీగా తరలివచ్చారు. అమర్ రహే నినాదాలతో ఆ ప్రాంతమంతా మారుమోగింది. అనంతరం మహేశ్(Martyr Soldier Mahesh) కుటుంబసభ్యులకు ప్రభుత్వం అందించిన సహాయానికి సంబంధించి పత్రాలను మంత్రి అందించారు.