తెలంగాణ

telangana

శ్రీరాంసాగర్ గేట్లు మూసివేత

By

Published : Oct 29, 2019, 5:31 PM IST

సుప్రీంకోర్టు ఆదేశానుసారం 120 రోజుల పాటు తెరచిఉన్న బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఇవాళ మధ్యాహ్నం మూతపడ్డాయి. మహారాష్ట్ర రాష్ట్ర నుంచి వరద ప్రవాహం తగ్గటంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ప్రధాన గేట్లను మూసివేశారు.

శ్రీరాంసాగర్ గేట్లు మూసివేత

నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ప్రధాన గేట్లను ఈరోజు మధ్యాహ్నం మూసివేశారు. మహారాష్ట్ర నుంచి వరద ప్రవాహం తగ్గిపోవటం వల్ల ప్రధాన గేట్లను మూసివేశారు. కేవలం ఎస్కేప్ గేట్ల ద్వారా గోదావరి నదిలోకి 2500 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. కాకతీయ కాలువ ద్వారా పంటలకు 5500 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ నీటిమట్టం 90 టీఎంసీలుగా ఉంది.

శ్రీరాంసాగర్ గేట్లు మూసివేత

ABOUT THE AUTHOR

...view details