తెలంగాణ

telangana

ETV Bharat / state

శ్రీకాంతాచారి విగ్రహం ఆవిష్కరణ - శ్రీకాంతాచారి విగ్రహాన్ని ఆవిష్కరించిన బ్రహ్మ శ్రీ తల్లోజు ఆచారి

ఎందరో అమరువీరుల త్యాగాల ఫలితంగా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని జాతీయ బీసీ కమిషనర్ సభ్యులు బ్రహ్మ శ్రీ తల్లోజు ఆచారి అన్నారు. నిజామాబాద్ నగరం హనుమాన్ జంక్షన్​లో శ్రీకాంతాచారి విగ్రహాన్ని ఆవిష్కరించారు.

srikantachari-statue-unveiled-in-nizamabad-town
శ్రీకాంతా చారి విగ్రహం ఆవిష్కరణ

By

Published : Aug 9, 2020, 8:18 PM IST

శ్రీకాంతాచారి చేసిన త్యాగాన్ని తెలంగాణ ప్రజలు ఎన్నడూ మరిచిపోరని జాతీయ బీసీ కమిషనర్ సభ్యులు బ్రహ్మ శ్రీ తల్లోజు ఆచారి అన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య ఎప్పుడూ సమసిపోతుందో ఆ రోజే అతని ఆత్మశాంతిస్తుందని పేర్కొన్నారు.

నిజామాబాద్ నగరంలోని హనుమాన్ జంక్షన్​లో ఆయన చేతుల మీదుగా శ్రీకాంతాచారి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తెలంగాణ మలిదశ ఉద్యమం దిశను శ్రీకాంతాచారి బలిదానం మార్చివేసింది అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు దాసోజు శ్రవణ్, జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి :మంజీర నీరే.. కానీ కాస్త నల్లగా, వాసన వస్తాయంతే!

ABOUT THE AUTHOR

...view details