సృష్టి ఉన్నంత వరకు పాటల రూపంలో ఏస్పీ బాలసుబ్రహ్మణ్యం... మనలో.. మనతోనే ఉంటారని.. ప్రముఖ నిర్మాత దిల్రాజు అన్నారు. సంగీత ప్రియుల మనసులో... ఆయన గొంతు ఎప్పుడూ.. మార్మోగుతూనే ఉంటుందన్నారు.
తిరుమల క్షేత్రంలో ఎస్పీ బాలు సంతాప సభ
నిజామాబాద్ జిల్లా ఇందూరు తిరుమల క్షేత్రంలో ఎస్పీ బాలు సంతాప సభ నిర్వహించారు. ఈ సందర్భంగా బాలు చిత్రపటానికి ప్రముఖ నిర్మాత దిల్ రాజు, ఇతర గాయకులు నివాళులు అర్పించారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం లేని లోటు ఎప్పటికీ తీర్చలేనిదని దిల్రాజు అన్నారు. తన బ్యానర్లో వచ్చిన చిత్రాల్లో బాలు ఎన్నో పాటలు పాడారని పేర్కొన్నారు.
తిరుమల క్షేత్రంలో ఎస్పీ బాలు సంతాప సభ
నిజామాబాద్ జిల్లా ఇందూరు తిరుమల క్షేత్రంలో ఎస్పీ బాలు సంతాప సభ నిర్వహించారు. పాటల నిధికి అశ్రునివాళి పేరుతో జరిగిన సభలో పాల్గొన్న దిల్రాజు.. బాలు చిత్రపటానికి నివాళులర్పించారు. బాలు గొంతుతోనే తన శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ ప్రారంభమైందని గుర్తుచేసుకున్నారు. బాలు మరణం చిత్రసీమకు తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి :ఉండ్రుగొండ గిరులు.. పర్యాటక సిరులు
Last Updated : Sep 28, 2020, 8:59 AM IST