కాలపరిమితి ముగిసిన టెండర్ను రద్దు చేసి ప్రభుత్వమే నేరుగా పనులు కల్పించాలని నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట పారిశుద్ధ్య కార్మికులు ధర్నా నిర్వహించారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఈ ఆందోళన చేపట్టారు. మెడికల్ కళాశాల, జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి, బోధన్ ఆస్పత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల కాలపరిమితి ముగిసినందున ప్రభుత్వమే టెండర్ను రద్దు చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై. ఓమయ్య కోరారు. వారికి ప్రభుత్వమే నేరుగా పనులు కల్పించాలని డిమాండ్ చేశారు.
'టెండర్ను రద్దు చేసి ప్రభుత్వమే ఉపాధి కల్పించాలి' - Sanitation staff held a dharna in front of Nizamabad District Government Hospital
నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట ఏఐటీయూసీ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య సిబ్బంది ధర్నా నిర్వహించారు. ప్రభుత్వ మెడికల్ కళాశాల, ఆస్పత్రిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కనీస వేతనంతో పాటు, పీఎఫ్ బకాయిలు చెల్లించాలని పేర్కొన్నారు.
!['టెండర్ను రద్దు చేసి ప్రభుత్వమే ఉపాధి కల్పించాలి' sanitation staff dharna at nizamabad hospital](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11060422-929-11060422-1616065530227.jpg)
నిజామాబాద్ ఆస్పత్రి ఎదుట ధర్నా
పారిశుద్ధ్య కార్మికులకు కనీస వేతనం రూ. 21 వేలు, సంవత్సరానికి రెండు జతల యూనిఫామ్, వేతనంతో కూడిన సెలవు, పీఎఫ్ బకాయిలను చెల్లించాలని సిబ్బంది డిమాండ్ చేశారు. కరోనా కేసులు పెరుగుతుండటంతో కార్మికుల సంఖ్యను పెంచాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి:'అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించడమే లక్ష్యం'