నిజామాబాద్ జిల్లాలో జాతీయ రహదారులు ప్రమాదాలకు నిలయాలుగా మారాయి. ముఖ్యంగా మలుపులు మృత్యు పిలుపులుగా మారాయి. జాతీయ రహదారి నుంచి గ్రామాలకు వెళ్లే చోట తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల్లో కొంత మంది ప్రాణాలు కోల్పోతుండగా... మరికొందరు క్షతగాత్రులుగా మిగులుతున్నారు. కుటుంబాన్ని పోషించే పెద్ద దిక్కును కోల్పోవడంతో ఆ కుటుంబాలు రోడ్డునపడుతున్నాయి.
ఎన్నో ప్రమాదాలు:
ఈనెల 19న తెల్లవారుజామున కంటైనర్ను డీసీఎం వ్యాన్ ఢీకొట్టడంతో ఇద్దరు ప్రమాదస్థలిలోనే మృతి చెందారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా సాంపల్లి వద్ద 44వ నంబర్ జాతీయ రహదారిపై జరిగింది.
కామారెడ్డి నుంచి ఆర్మూర్ వైపు కోళ్ల లోడుతో వెళ్తున్న డీసీఎం వాహనం... కాళేశ్వరం ప్యాకేజ్లో భాగంగా... భారీ పైపులను తీసుకెళ్తున్న కంటైనర్ను వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో డీసీఎం డ్రైవర్, క్లీనర్ ఘటనాస్థలిలోనే ప్రాణాలు కోల్పోయారు. మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి.
వారం రోజుల వ్యవధిలో ఇదే మూలమలుపు వద్ద తెల్లవారుజామున ఒంటి గంట సమయంలో భారీ పైపుల లోడ్తో యూటర్న్ తీసుకుంటున్న కంటైనర్ను వెనుక నుంచి వస్తున్న లారీ, ఢీ కొట్టింది. కంటైనర్ పైన ఉన్న పైపులు రోడ్డుపై పడడంతో ముందు నుంచి వస్తున్న అశోక్ లేలాండ్ ట్రాలీ ఆటో పైపులను ఢీ కొట్టింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్, క్లీనర్తో పాటు ట్రాలీ ఆటోలో ఉన్న హర్షవర్ధన్, గౌతమ్లకు తీవ్రగాయాలయ్యాయి. భారీ వాహనాలతో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తరచూ ప్రమాదాలు