తెలంగాణ

telangana

By

Published : Dec 19, 2019, 1:58 PM IST

ETV Bharat / state

డిచ్​పల్లిలో కంటైనర్​ను ఢీ కొట్టిన డీసీఎం... ఇద్దరు మృతి

కంటైనర్​ను.. డీసీఎం వ్యాన్ ఢీ కొట్టడం వల్ల ... ఇద్దరు ప్రమాద స్థలిలోనే మృతిచెందిన ఘటన డిచ్​పల్లి మండలం సాంపల్లిలో జరిగింది.

road accident in dichpally nizamabad district two people died
డిచ్​పల్లిలో కంటైనర్​ను ఢీ కొట్టిన డీసీఎం... ఇద్దరు మృతి

నిజామాబాద్ జిల్లా డిచ్​పల్లి మండలం సాంపల్లి వద్ద 44వ నంబరు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. కంటైనర్​రు డీసీఎం వాహనం ఢీ కొట్టిన ఘటనలో ఇద్దరు మృతిచెందగా.. ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. కామారెడ్డి నుంచి ఆర్మూర్ వైపు కోళ్ల లోడుతో వెళ్తున్న డీసీఎం వాహనం... కాళేశ్వరం ప్యాకేజ్​లో భాగంగా భారీ పైపులను తీసుకువెళ్తున్న కంటైనర్​ను వెనుక నుంచి ఢీ కొట్టింది. ప్రమాదంలో డీసీఎం నుజ్జునుజ్జయింది.

డీసీఎం డ్రైవర్ షేక్ కరీం, క్లీనర్ ముజాహిద్ ఘటనాస్థలిలోనే ప్రాణాలు కోల్పోయారు. మరో వ్యక్తి రమేష్​ తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని హైవే అంబులెన్స్​లో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

డిచ్​పల్లిలో కంటైనర్​ను ఢీ కొట్టిన డీసీఎం... ఇద్దరు మృతి

ఇదీ చూడండి: ఔటర్​ రింగ్​రోడ్డుపై ప్రమాదం... 9 మందికి గాయాలు

ABOUT THE AUTHOR

...view details