తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇందూరు కౌంటింగ్​కు సర్వం సిద్ధం - ramohan rao

లెక్కింపు కేంద్రాల్లో సెల్​ఫోన్ అనుమతి లేదని... అందరూ నిబంధనలు పాటించాలని నిజామాబాద్ పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి రామ్మోహన్ రావు సూచించారు.

పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి

By

Published : May 22, 2019, 2:58 PM IST

Updated : May 22, 2019, 3:05 PM IST

లోక్​సభ కౌంటింగ్ కోసం సర్వం సిద్ధంగా ఉన్నామని నిజామాబాద్ పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి రామ్మోహన్ రావు తెలిపారు. భారత ఎన్నికల సంఘం 36 టేబుళ్లతో లెక్కింపు చేసేందుకు అనుమతి ఇచ్చిందని... అందుకు అనుగుణంగా హాళ్లు, టేబుళ్లు సిద్ధం చేసినట్లు వెల్లడించారు. నిజామాబాద్ అర్బన్, రూరల్, కోరుట్ల, జగిత్యాలలో 8 రౌండ్లు... బోధన్, బాల్కొండ నియోజకవర్గాలు 7 రౌండ్లు, ఆర్మూర్ నియోజకవర్గం 6 రౌండ్లలో లెక్కింపు చేయనున్నట్లు తెలిపారు. వీవీ ప్యాట్ స్లిప్పుల లెక్కింపునకు సైతం ఐదు రౌండ్ల సమయం పడుతుందని ఉద్ఘాటించారు.

పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి
Last Updated : May 22, 2019, 3:05 PM IST

ABOUT THE AUTHOR

...view details