తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇందూరులో ఘనంగా రాజీవ్​ గాంధీ జయంతి వేడుకలు - నిజామాబాద్​ జిల్లా వార్తలు

నిజామాబాద్​ జిల్లాలో రాజీవ్​గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. దేశానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడానికి అహర్నిశలు కృషి చేసిన మహోన్నత వ్యక్తి రాజీవ్ గాంధీ అని జిల్లా కాంగ్రెస్​ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్​రెడ్డి అన్నారు.

Rajiv Gandhi Jayanti celebrations in nizambad
ఇందూరులో ఘనంగా రాజీవ్​ గాంధీ జయంతి వేడుకలు

By

Published : Aug 20, 2020, 2:44 PM IST

దేశంలో సాంకేతిక విప్లవ సారధి రాజీవ్​ గాంధీ అని నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్​ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్​రెడ్డి అన్నారు. నగరంలోని కాంగ్రెస్​ భవన్​లో రాజీవ్​గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. దేశానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడానికి అహర్నిశలు కృషి చేసిన మహోన్నత వ్యక్తి రాజీవ్ గాంధీ అని కొనియాడారు.

ఇందూరులో ఘనంగా రాజీవ్​ గాంధీ జయంతి వేడుకలు

ఆయన చేసిన కృషి ఫలితమే ప్రపంచ స్థాయిలో సాంకేతిక పరంగా మనం ముందంజలో ఉన్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కేశ వేణు ,అర్బన్ ఇంఛార్జి తాహెర్ బిన్ హందాన్, కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు ముప్పా గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:కరోనా పరీక్షల సామర్థ్యం పెంపుపై ఐసీఎంఆర్​ సూచనలు

ABOUT THE AUTHOR

...view details