తెలంగాణ

telangana

సన్నాలకు మద్దతుధర కల్పించాలని భాజపా రాస్తారోకో

నిజామాబాద్​ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట వద్ద భాజపా ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. సన్నరకం ధాన్యానికి సరైన మద్దతుధరను కల్పించి రైతులకు తగిన న్యాయం చేయాలని డిమాండ్​ చేశారు.

By

Published : Nov 6, 2020, 7:19 PM IST

Published : Nov 6, 2020, 7:19 PM IST

protest against support price for thin variety rice in  nizamabad district
సన్నాలకు మద్దతుధర కల్పించాలని భాజపా రాస్తారోకో

సన్న బియ్యానికి మద్దతు ధర కల్పించాలని డిమాండ్​ చేస్తూ నిజమాబాద్​ జిల్లాలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఎడపల్లి మండలం జానకంపేట వద్ద భాజపా ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. తెరాస ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెంటనే సన్నరకం ధాన్యానికి మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్​ చేశారు.

నిర్బంధంగా రైతులతో సన్నాలు సాగు చేయించిన సీఎం కేసీఆర్​.. సరైన మద్దతు ధర ఇవ్వకపోవడం శోచనీయమని భాజపా జిల్లా అధ్యక్షుడు బస్వా లక్ష్మీనర్సయ్య ఆరోపించారు. వెంటనే సన్నాలకు రూ. 2,500 ధరతో కొనుగోలు చేయాలని డిమాండ్​ చేశారు. అలాగే ప్రభుత్వ ప్రకటనకు ముందే మక్కలు అమ్ముకున్న రైతులకు రూ. 500 బోనస్​ ప్రకటించాలన్నారు.

ఇదీ చదవండి:ఆ పరిస్థితిని కేసీఆర్ ప్రభుత్వం కొనితెచ్చుకోవద్దు: బండి సంజయ్

ABOUT THE AUTHOR

...view details