తెలంగాణ

telangana

ETV Bharat / state

విద్యుదాఘాతంతో ప్రైవేట్​ ఎలక్ట్రిషియన్ మృతి - nizamabad district latest news

నిజామాబాద్ జిల్లా నవీపేట్​లో విషాదం చోటుచేసుకుంది. మరమ్మతులు చేస్తుండగా... ప్రమాదవశాత్తు విద్యుదాఘాతంతో ప్రైవేట్ ఎలక్ట్రిషియన్ మృతి చెందాడు.

Private electrician died by electric shock in nizamabad district
విద్యుదాఘాతంతో ప్రైవేట్​ ఎలక్ట్రిషియన్ మృతి

By

Published : Jan 15, 2021, 5:37 AM IST

విద్యుదాఘాతంతో ప్రైవేట్ ఎలక్ట్రిషియన్ మృతి చెందిన ఘటన నిజామాబాద్ జిల్లా నవీపేట్​లో చోటుచేసుకుంది. సుభాష్​నగర్​కు చెందిన రజాక్(35)... ఓ వెల్డింగ్ దుకాణంలో విద్యుత్ రావడం లేదని చెప్పడంతో స్తంభం ఎక్కాడు. మరమ్మతు చేస్తుండగా పైనున్న 11కేవీ వైర్లు అతనికి తగిలాయి.

వెంటనే మంటలు చెలరేగి అతనికి అంటుకోవడంతో... సగం వరకు కాలిపోయి విద్యుత్​ వైర్లకు వేలాడుతూ కనిపించాడు. వాటి నుంచి వేరు చేయగానే అప్పటికే తీవ్ర గాయాలపాలైన రజాక్ కింద పడిపోయాడు. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందినట్లు స్ధానికులు తెలిపారు. మృతుడికి 4నెలల కిందటే వివాహం అయింది.

ఇదీ చదవండి: భక్తిపారవశ్యం... రామేశ్వరాలయంలో భక్తుల కోలాహలం

ABOUT THE AUTHOR

...view details