తెలంగాణ

telangana

ప్లాస్టిక్ నిర్మూలనపై పోలీసుల అవగాహన కార్యక్రమం

ప్లాస్టిక్ నివారిద్దాం-పర్యావరణాన్ని కాపాడుదాం అంటూ ఈనాడు-ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా డిచ్​పల్లిలోని టీఎస్​పీఎస్సీ 7వ పటాలం సిబ్బంది అవగాహన ర్యాలీ నిర్వహించారు.

By

Published : Oct 1, 2019, 1:32 PM IST

Published : Oct 1, 2019, 1:32 PM IST

ప్లాస్టిక్ నిర్మూలనపై పోలీసుల అవగాహన కార్యక్రమం

నిజామాబాద్ జిల్లా పల్లిలోని ఏడవ బెటాలియన్ సిబ్బంది ఈనాడు-ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో డిచ్​పల్లి మండల కేంద్రంలో ప్లాస్టిక్ నివారణపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. డిచ్​పల్లిలో ప్రధాన వీధుల గుండా తిరుగుతూ... ప్లాస్టిక్ నిర్మూలిద్దమని నినాదాలు చేశారు. ఈనాడు-ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిర్మూలనపై అవగాహన కల్పించడం ఆనందంగా ఉందని బెటాలియన్ కమాండెంట్ సాంబయ్య తెలిపారు. ప్లాస్టిక్ వల్ల మనుషులకే కాకుండా జంతువులకూ హాని జరుగుతోందని... ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి పర్యావరణాన్ని కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో బెటాలియన్ సిబ్బంది పాల్గొన్నారు.

ప్లాస్టిక్ నిర్మూలనపై పోలీసుల అవగాహన కార్యక్రమం

ABOUT THE AUTHOR

...view details