తెలంగాణ

telangana

ETV Bharat / state

పీజీ సెంటర్లను ఎత్తివేస్తే ఊరుకోం..

పీజీ సెంటర్ల ఎత్తివేతను నిరసిస్తూ నిజామాబాద్​లో పీడీఎస్​యూ నాయకులు ధర్నా చేపట్టారు. ఈ ప్రకటనను ప్రభుత్వం వెనక్కి తీసుకోకపోతే ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.

By

Published : Jul 9, 2019, 7:38 PM IST

పీజీ సెంటర్లను ఎత్తివేస్తే ఊరుకోం..

రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పీజీ సెంటర్లను ఎత్తి వేయడాన్ని నిరసిస్తూ నిజామాబాద్​లో పీడీఎస్​యూ నగర కమిటీ ఆధ్వర్యంలో గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల ఎదుట ధర్నాకు దిగారు. పీజీ సెంటర్ల ఎత్తివేత ప్రకటన జారీ చేయడం పేద విద్యార్థులకు ఉన్నత విద్యను దూరం చేయడమేనని పీడీఎస్​యూ నగర అధ్యక్షుడు సాయి కృష్ణ పేర్కొన్నారు. పీజీ సెంటర్ల ఎత్తివేతను రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని విద్యార్థి నాయకులు హెచ్చరించారు. విద్యని వ్యాపారంగా మార్చడానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ చర్యకు పూనుకుందని ఆరోపించారు.

పీజీ సెంటర్లను ఎత్తివేస్తే ఊరుకోం..

ABOUT THE AUTHOR

...view details