తెలంగాణ

telangana

ETV Bharat / state

నూతన కలెక్టరేట్​కు బస్సులు నడపాలంటూ పీడీఎస్​యూ ధర్నా - pdsu nirasana

నిజామాబాద్​ జిల్లా కేంద్రంలోని కలెక్టర్​ కార్యాలయం ఎదుట పీడీఎస్​యూ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. నూతన సమీకృత కలెక్టరేట్​కు ఆర్టీసీ బస్సులు నడపాలని డిమాండ్​ చేశారు.

pdsu-dharna-in-front-of-nizamabad-collectorate
నూతన కలెక్టరేట్​కు బస్సులు నడపాలంటూ పీడీఎస్​యూ ధర్నా

By

Published : Sep 22, 2020, 10:57 PM IST

నిజామాబాద్ నూతన సమీకృత కలెక్టరేట్​కు ఆర్టీసీ సిటీ బస్సులు నడిచేలా చొరవ చూపాలని కోరుతూ కలెక్టరేట్ ఎదుట పీడీఎస్​యూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. త్వరలో నూతన కలెక్టరేట్​ను ప్రారంభిస్తామని కలెక్టర్ ప్రకటించడం అభినందనీయమని.. నగర శివారులో ఉండటం వల్ల కలెక్టరేట్​కు వచ్చే ప్రజల సౌకర్యార్థం బస్టాండ్ నుంచి నూతన సమీకృత కలెక్టరేట్​కు సిటీ బస్సులు నడపాలని కోరారు.

నూతన కలెక్టరేట్​కు బస్సులు నడపాలంటూ పీడీఎస్​యూ ధర్నా

ఈ మేరకు ఫిర్యాదుల పెట్టె ద్వారా కలెక్టర్​ నారాయణరెడ్డికి వినతి పత్రం అందజేశారు. ధర్నాలో పీడీఎస్​యూ జిల్లా అధ్యక్షురాలు కల్పన, పలువురు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఇదీచూడండి.. రెవెన్యూ చట్టాల గెజిట్ నోటిఫికేషన్ విడుదల

ABOUT THE AUTHOR

...view details