తెలంగాణ

telangana

ETV Bharat / state

బోధన్​లో రీ-పోలింగ్ ప్రశాంతం - latest news on re polling

బోధన్​ మున్సిపాలిటీలోని 87వ పోలింగ్​ బూత్​లో అధికారులు రీ-పోలింగ్ ప్రారంభించారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్​ జరగనుంది.​

Officers conduct re-polling in Bodhan
బోధన్​లో రీ-పోలింగ్ నిర్వహిస్తున్న అధికారులు​

By

Published : Jan 24, 2020, 10:36 AM IST

నిజామాబాద్ జిల్లా బోధన్ మున్సిపాలిటీలోని 32వ వార్డులో టెండర్ ఓటు కారణంగా 87వ పోలింగ్ బూత్​లో రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అధికారులు రీ-పోలింగ్ ప్రారంభించారు. 32వ వార్డు 87వ పోలింగ్ బూత్​లోని మొత్తం 588 ఓటర్లు మళ్లీ ఓటు వేస్తున్నారు.

బుధవారం జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఇదే వార్డుకు చెందిన నసెహ సుల్తానా టెండర్ ఓటు విషయం కోర్టుకు వెళ్లడం వల్ల అధికారులు ఈరోజు రీ-పోలింగ్ నిర్వహిస్తున్నారు. పోలింగ్ కేంద్రం వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

బోధన్​లో రీ-పోలింగ్ నిర్వహిస్తున్న అధికారులు​

ఇవీచూడండి: ఆర్టీసీ కార్గో సేవలకు ముహూర్తం ఖరారు..

ABOUT THE AUTHOR

...view details