తెలంగాణ

telangana

ETV Bharat / state

గ్రీన్​ ఫ్రైడేలో భాగంగా మొక్కలు నాటిన జడ్పీ ఛైర్మన్​

భూ సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్​ ప్రవేశపెట్టిన నూతన రెవెన్యూ చట్టాన్ని నిజామాబాద్​ జడ్పీ ఛైర్మన్​ విఠల్​రావు కొనియాడారు. అనంతరం గ్రీన్​ ఫ్రైడేలో భాగంగా పరిషత్​ కార్యాలయ ఆవరణలో జడ్పీ ఛైర్మన్​ మొక్కలు నాటారు.

By

Published : Sep 11, 2020, 10:45 PM IST

celebrations at nizamabad for implementing new revenue act
గ్రీన్​ ఫ్రైడేలో భాగంగా మొక్కలు నాటిన జడ్పీ ఛైర్మన్​

తెలంగాణ రాష్ట్రంలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చేసేందుకు నూతన రెవెన్యూ చట్టాన్ని రూపొందించిన మహా నాయకుడు కేసీఆర్​ అని నిజామాబాద్ జడ్పీ ఛైర్మన్​ విఠల్​రావు కొనియాడారు. స్థానిక మక్లూర్​ మండల పరిషత్​ కార్యాలయం ఎదుట కొత్త రెవెన్యూ చట్టాన్ని స్వాగతిస్తూ టపాసులను కాల్చి సంబురాలు చేసుకున్నారు.

అనంతరం గ్రీన్​ ఫ్రైడేలో భాగంగా పరిషత్​ కార్యాలయ ఆవరణలో జడ్పీ ఛైర్మన్​ మొక్కలు నాటారు. కేసీఆర్ రాష్ట్ర ప్రజలకున్న సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు నూతన చట్టాలని రూపొందిస్తున్నారని విఠల్​రావు అన్నారు. యావత్​ తెలంగాణ రైతులు.. వీఆర్వో వ్యవస్థ రద్దును స్వాగతిస్తున్నారన్నారు.

ఇదీ చదవండి:నూతన రెవెన్యూ చట్టం ఆరంభం మాత్రమే: కేసీఆర్‌

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details