నిజామాబాద్ అర్బన్, రూరల్ ఎమ్మెల్యేలు బీగాల గణేష్ గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని... తెరాస నాయకులు పాదయాత్ర చేపట్టారు. నిజామాబాద్లోని సంకట విమోచన హనుమాన్ మందిరం నుంచి మోపాల్ మండలం నర్సింగ్పల్లి ఇందూరు తిరుమల క్షేత్రం వరకు పాదయాత్ర చేసి, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఎమ్మెల్యేలు కోలుకోవాలని తెరాస నాయకుల పాదయాత్ర - ఎమ్మెల్యేలు కోలుకోవాలని పాదయాత్ర
నిజామాబాద్ నుంచి మోపాల్ మండలం ఇందూరు తిరుమల క్షేత్రం వరకు తెరాస నాయకులు పాదయాత్ర నిర్వహించారు. కరోనా బారిన పడిన నిజామాబాద్ అర్బన్, రూరల్ ఎమ్మెల్యేలు త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
![ఎమ్మెల్యేలు కోలుకోవాలని తెరాస నాయకుల పాదయాత్ర nizamabad trs leaders padayathra and speial prayers at induru thirumala temle](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7672646-thumbnail-3x2-padayathra.jpg)
ఎమ్మెల్యేలు కోలుకోవాలని తెరాస నాయకుల పాదయాత్ర
ప్రజాసేవలో నిరంతరం కష్టపడుతూ... కరోనా కట్టడికి కృషి చేసిన ఎమ్మెల్యేలు వైరస్ బారిన పడటం దురదృష్టకరమని నాయకులు అన్నారు. లాక్డౌన్ సమయంలో నిరుపేదలకు, వలస కార్మికులకు నిత్యం అన్నదానం చేసినట్టు తెలిపారు. నగరాభివృద్ధికి నిరంతరం సేవలందించారని కొనియాడారు. త్వరగా కోలుకొని నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని భగవంతుడిని ప్రార్థించారు.
ఇదీ చూడండి:కశ్మీర్లో ఉగ్ర ఏరివేత.. వేర్వేరు చోట్ల ఎన్కౌంటర్లు