తెలంగాణ

telangana

ETV Bharat / state

నిజామాబాద్​ విద్యార్థులకు అండర్​-14 రైఫిల్​ షూటింగ్​లో బంగారు పతకాలు - నిజామాబాద్​ తాజా వార్తలు

Nizamabad students win gold medals: తాము చదువులోనే కాదు ఆటల్లోను మేటి అని నిరుపించారు నిజామాబాద్​కు చెందిన విద్యార్థులు. ఎస్​ఎస్​ఆర్ డిస్కవరీ స్కూల్​లో చదివే ముగ్గురు విద్యార్థులు తమిళనాడులో జరిగిన రైఫిల్​ షూటింగ్​ టోర్నమెంట్​లో మూడు బంగారు పతకాలు సాధించారు.

Etv Bharat
Etv Bharat

By

Published : Dec 17, 2022, 5:53 PM IST

Nizamabad students win gold medals: తమిళనాడులోని దిండిగల్​లో జరిగిన సి.బి.యస్.ఇ సౌత్ జోన్ అండర్-14 రైఫిల్ షూటింగ్ టోర్నమెం​ట్​లో నిజామాబాద్​కు చెందిన ముగ్గురు విద్యార్థులకు బంగారు పతకాలు లభించాయి. నగరంలోని ఎస్​ఎస్​ఆర్ డిస్కవరీ స్కూల్​లో చదువుతున్న షేక్​ ముస్తకిన్ జాఫీర్, ముస్తఫాసాధ్,షేక్​ హాసనొద్దిన్​లు 3 బంగారు పతకాలు సొంతం చేసుకొన్నారు.

ఝార్ఖండ్ రాంచీలో జనవరిలో జరిగే అల్ ఇండియా నేషనల్ అండర్ 14 రైఫిల్ షూటింగ్​కి ఎస్​ఎస్​ఆర్ డిస్కవరీ స్కూల్ నుంచి మరో ఇద్దరు విద్యార్థులు తహోద్దిన్, ఆఫ్నానొద్దిన్​లు ఎంపికయ్యారు. బంగారు పతకాలు సాధించిన విద్యార్థులను స్కూల్ యాజమాన్యం వారిని ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేసింది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details