లాక్డౌన్లో అన్నార్థులకు ఆహారం అందించి... నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా మానవత్వాన్ని చాటుకున్నారు. నగరంలోని ఆశావర్కర్లు, పారిశుద్ధ్య కార్మికులు, జర్నలిస్టులు, వలస కార్మికులకు ఆహారం అందించారు. లాక్డౌన్ సడలింపుల నేపథ్యంలో నేటి నుంచి ఆహార సరఫరా నిలిపి వేస్తున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. లాక్డౌన్ సమయంలో పేదలను ఆదుకోవడం బాధ్యతగా భావించినట్లు తెలిపారు. ఈ ముగింపు కార్యక్రమంలో కలెక్టర్ నారాయణరెడ్డి, సీపీ కార్తికేయ, ఎమ్మెల్యే ఆకుల లలిత హాజరయ్యారు.
'పేదలను ఆదుకోవడం బాధ్యతగా భావించా...' - ఆహార పంపిణీ చేసిన ఎమ్మెల్యే గణేష్ గుప్తా
లాక్డౌన్ నేపథ్యంలో అన్నార్థులకు అండగా నిలుస్తూ... పలువురు రాజకీయ నాయకులు ఉదారత చాటుకుంటున్నారు. నిజామాబాద్ అర్బన్ జిల్లా ఎమ్మెల్యే గణేష్ గుప్తా ఆహారాన్ని అందించారు.
'పేదలను ఆదుకోవడం బాధ్యతగా భావించా...'