నిజామాబాద్ నగర మేయర్ నీతూ కిరణ్... పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. నగరంలోని 20వ డివిజన్ ఎల్లమ్మ గుట్ట ప్రాంతంలో 10 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు.
పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన మేయర్ - నిజామాబాద్ నగర మేయర్ నీతూ కిరణ్ తాజా వార్తలు
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు నగర మేయర్ నీతూ కిరణ్. అలాగే 10, 11వ డివిజన్లలో కొనసాగుతున్న పనులను త్వరగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.
![పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన మేయర్ nizamabad mayor started development programs](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-06:30:53:1621342853-tg-nzb-05-18-bhu-puja-av-ts10123-18052021181449-1805f-1621341889-93.jpg)
పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన మేయర్
అలాగే నగరంలోని 10, 11వ డివిజన్లలో కొనసాగుతున్న మంచి నీటి పైప్ లైన్ పనులు, వీధి దీపాల ఏర్పాట్లను మేయర్ నీతూ కిరణ్ పర్యవేక్షించారు. త్వరితగతిన పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ న్యాలమ్ రాజు, తెరాస నాయకులు సుజన్, మున్సిపల్ ఇంజినీర్ వాజీద్ కాలనీ వాసులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:కంటతడి పెట్టిస్తున్న కానిస్టేబుల్ వీడియో
TAGGED:
నిజామాబాద్ పట్టణ అభివృద్ధి