తెలంగాణ

telangana

ETV Bharat / state

అనవసరపు నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలి : నీతూ కిరణ్​ - నిజామాబాద్​ మేయర్​ పట్టణ పర్యటన

ప్రజలు తమ నివాస పరిసరాల్లో నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని నిజామాబాద్​ మేయర్​ నీతూ కిరణ్​ తెలిపారు. ఆదివారం ఉదయం 10 గంటలకు 10 నిమిషాలు కార్యక్రమంలో భాగంగా నగరంలోని మారుతీనగర్​లో మేయర్​ పర్యటించారు. కాలనీలోని నిల్వ నీటిలో దోమలు వృద్ధి చెందకుండా ఆయిల్​బాల్స్​ను వేశారు.

Nizamabad Mayor visiting town
Nizamabad Mayor visiting town

By

Published : Jun 21, 2020, 7:54 PM IST

సీజనల్​ వ్యాధులు రాకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని నిజామాబాద్​ మేయర్​ నీతూ కిరణ్​ సూచించారు. ఆదివారం ఉదయం 10 గంటలకు 10 నిమిషాలు కార్యక్రమంలో భాగంగా నగరంలోని మారుతీనగర్​లో మేయర్​ పర్యటించారు. కాలనీలోని నిల్వ నీటిలో దోమలు వృద్ధి చెందకుండా ఆయిల్​బాల్స్​ను వేశారు.

వర్షాకాలం ప్రారంభమైనందున ప్రతి ఒక్కరూ తమ పరిసరాల్లో నీటి నిల్వలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే డెంగ్యూ, చికెన్​గున్యా వంటి వ్యాధులు రావని తెలిపారు. మేయర్​ వెంట మున్సిపల్ కమిషనర్ జితేశ్​ వీ పాటిల్, కార్పొరేటర్లు విక్రమ్ గౌడ్, సాయివర్ధన్, బట్టు రాఘవేందర్, ధర్మపురి మల్లేశ్​, అరుణ్, యమున, అనిల్ తదితరులున్నారు.

ఇదీ చూడండి:బోర్డర్​లో కొత్త రూల్స్- తుపాకులు వాడేందుకు సై!

ABOUT THE AUTHOR

...view details