తెలంగాణ

telangana

By

Published : Apr 29, 2020, 6:22 PM IST

ETV Bharat / state

భీమ్​గల్​లో అక్రమ కలప పట్టివేత

నిజామాబాద్​ జిల్లా భీమ్​గల్ మండలం కారేపల్లి ఫారెస్ట్​ బీట్​ పరిధిలో పోలీస్​, ఫారెస్ట్​, ఎక్సైజ్​ శాఖలు సంయుక్తంగా దాడులు చేసి అక్రమ కలపను పట్టుకున్నాయి. నాలుగు ట్రాక్టర్ల టేకు దుంగలు, ట్రాక్టర్లు, కార్పెంటర్​ యంత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ​

భీమ్​గల్​లో అక్రమ కలప పట్టివేత
భీమ్​గల్​లో అక్రమ కలప పట్టివేత

నిజామాబాద్ జిల్లా భీమ్​గల్ మండలం కారేపల్లి పరిధిలోని భూక్య తండా, హనుమాన్ తండా పరిసర ప్రాంతాల్లో... పోలీస్​, ఫారెస్ట్​, ఎక్సైజ్​ శాఖలు సంయుక్తంగా దాడులు నిర్వహించి అక్రమ కలపను స్వాధీనం చేసుకున్నాయి. 3 రోజుల క్రితం ఇదే ప్రాంతంలో తనిఖీలకు వెళ్లిన అటవీ సిబ్బందిని స్థానికులు అడ్డుకున్నారు.

అటవీ ఉత్పత్తులను నిల్వ చేశారన్న సమాచారంతో బుధవారం నిజామాబాద్ సీపీ కార్తికేయన్, జిల్లా అటవీ శాఖ అధికారి సునీల్ హెరామత్, ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ నవీన్ చంద్ర పర్యవేక్షణలో ఉమ్మడి ఆపరేషన్ నిర్వహించారు. నాలుగు ట్రాక్టర్ల టేకు దుంగలతోపాటు ట్రాక్టర్లు, కార్పెంటర్ మెషిన్, ఐదు లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.

ఇవీచూడండి:ఆ విషయం గురించి కేటీఆర్​తో మాట్లాడా: కిషన్​రెడ్డి

ABOUT THE AUTHOR

...view details