తెలంగాణ

telangana

ETV Bharat / state

బస్సుయాత్రకు సిద్ధమైన పసుపు, ఎర్రజొన్న రైతులు

లోక్ సభ బరిలో నిలిచిన పసుపు, ఎర్రజొన్న రైతులు భవిష్యత్ కార్యాచరణపై దృష్టిపెట్టారు. ఆర్మూరులో సమావేశమైన కర్షకులు.. త్వరలో పోటీలో ఉన్న వారిలో ఒకరిని తమ నాయకునిగా ఎన్నుకోవాలని తీర్మానించారు.

By

Published : Mar 30, 2019, 6:22 PM IST

పసుపు, ఎర్రజొన్న రైతులు

రైతును గెలిపించాలని నిజామాబాద్​ కర్షకుల వినతి
నిజామాబాద్​ లోక్​సభ ఎన్నికల బరిలో ఉన్న పసుపు, ఎర్రజొన్న రైతులు ఆర్మూర్​లో సమావేశమయ్యారు. తమ భవిష్యత్​ కార్యాచరణ ప్రకటించారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ అన్ని గ్రామాల్లో బస్సు యాత్ర చేపట్టాలని,బూత్​ కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఏప్రిల్​ 8 లేదా 9న ఆర్మూరులో బహిరంగ సభ నిర్వహించి పోటీలో ఉన్న వారిలో ఒకరిని తమ నేతగా ఎన్నుకొని అతనికే ఓటెయ్యాలని అభ్యర్థించనున్నారు.

రైతునుగెలిపించండి

పార్లమెంటులో రైతులకు రిజర్వేషన్లు కల్పించాలని కర్షకులుడిమాండ్​ చేశారు. రైతును విస్మరిస్తే రాజకీయ పార్టీలకు ఎలాంటి గతి పడుతుందో తెలియచెప్పాలని రైతు నాయకుడు అన్వేష్​రెడ్డి తెలిపారు. గ్రామాల్లో ప్రజలు తాము బలపరిచిన అభ్యర్థులను గెలిపించి అన్నదాతను గెలిపించాలని కోరుతున్నారు.

ఇదీ చదవండి :'పట్టాదారు పాసు పుస్తకాలిస్తేనే... ఓట్లేస్తాం'

ABOUT THE AUTHOR

...view details