నిజామాబాద్ జిల్లాకు చెందిన ఫుట్బాల్ క్రీడాకారిణి సౌమ్యకు అరుదైన అవకాశం దక్కింది. రేంజల్ మండలం కిసాన్నగర్ తండాకు చెందిన గుగులోత్ సౌమ్య... భారత మహిళా సీనియర్ జట్టుకు ఎంపికైంది. గోవాలో జరిగిన 2 నెలల శిక్షణ శిబిరంలో ప్రతిభ కనబరిచిన సౌమ్యను జట్టుకు ఎంపికచేశారు.
భారత ఫుట్బాల్ మహిళా జట్టులో తెలుగమ్మాయికి స్థానం
భారత ఫుట్బాల్ మహిళా సీనియర్ జట్టుకు మొదటిసారి ఓ తెలుగమ్మాయి ఎంపికైంది. ఓ మారుమూల ప్రాంతానికి చెందిన ఓ గిరిజన యువతి భారత జట్టుకు ప్రాతినధ్యం వహించే సువర్ణావకాశాన్ని చేజిక్కించుకుంది. నిజామాబాద్ జిల్లా రేంజల్ మండలం కిసాన్నగర్ తండాకు చెందిన సౌమ్య భారత జట్టులో చోటు దక్కించుకుంది.
nizamabad district player selected for indian women football team
ఈ నెల 14, 24 తేదీల్లో టర్కీతో భారత జట్టు తలపడనుంది. మారుమూల ప్రాంతం నుంచి వచ్చిన గిరిజన యువతి సౌమ్య... ఫుట్బాల్ క్రీడలో అద్భుత ప్రతిభ కనబరుస్తూ అంచెలంచెలుగా ఎదిగింది.
తెలుగు రాష్ట్రాల నుంచి సీనియర్ ఫుట్బాల్ జట్టుకు ప్రాతినిధ్యం వహించే అవకాశం దక్కించుకుని తన కల నిజం చేసుకుంది. ఈ అవకాశం దక్కటం పట్ల సౌమ్యతో పాటు ఆమె కోచ్ నాగరాజ్ హర్షం వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి:నెల్లికల్లులో ఎత్తిపోతల పథకాలకు సీఎం శంకుస్థాపన
TAGGED:
indian women football team