తెలంగాణ

telangana

ETV Bharat / state

భారత ఫుట్​బాల్ మహిళా జట్టులో తెలుగమ్మాయికి స్థానం

భారత ఫుట్​బాల్​ మహిళా సీనియర్ జట్టుకు మొదటిసారి ఓ తెలుగమ్మాయి ఎంపికైంది. ఓ మారుమూల ప్రాంతానికి చెందిన ఓ గిరిజన యువతి భారత జట్టుకు ప్రాతినధ్యం వహించే సువర్ణావకాశాన్ని చేజిక్కించుకుంది. నిజామాబాద్​ జిల్లా రేంజల్​ మండలం కిసాన్​నగర్​ తండాకు చెందిన సౌమ్య భారత జట్టులో చోటు దక్కించుకుంది.

By

Published : Feb 10, 2021, 3:32 PM IST

nizamabad district player selected for indian women football team
nizamabad district player selected for indian women football team

గుగులోత్​ సౌమ్య

నిజామాబాద్​ జిల్లాకు చెందిన ఫుట్​బాల్​ క్రీడాకారిణి సౌమ్యకు అరుదైన అవకాశం దక్కింది. రేంజల్​ మండలం కిసాన్​నగర్​ తండాకు చెందిన గుగులోత్​ సౌమ్య... భారత మహిళా సీనియర్​ జట్టుకు ఎంపికైంది. గోవాలో జరిగిన 2 నెలల శిక్షణ శిబిరంలో ప్రతిభ కనబరిచిన సౌమ్యను జట్టుకు ఎంపికచేశారు.

శిక్షణలో ప్రతిభ కనబరుస్తూ...

ఈ నెల 14, 24 తేదీల్లో టర్కీతో భారత జట్టు తలపడనుంది. మారుమూల ప్రాంతం నుంచి వచ్చిన గిరిజన యువతి సౌమ్య... ఫుట్‌బాల్‌ క్రీడలో అద్భుత ప్రతిభ కనబరుస్తూ అంచెలంచెలుగా ఎదిగింది.

ప్రాక్టీస్​లో...

తెలుగు రాష్ట్రాల నుంచి సీనియర్ ఫుట్​బాల్ జట్టుకు ప్రాతినిధ్యం వహించే అవకాశం దక్కించుకుని తన కల నిజం చేసుకుంది. ఈ అవకాశం దక్కటం పట్ల సౌమ్యతో పాటు ఆమె కోచ్​ నాగరాజ్​ హర్షం వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి:నెల్లికల్లులో ఎత్తిపోతల పథకాలకు సీఎం శంకుస్థాపన

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details