నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం గోవిందపేట్లో జరిగిన అమానవీయ ఘటన.. మరోసారి జిల్లాలో పునరావృతం కాకుండా చూడాలని కలెక్టర్ సి.నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. కొవిడ్తో మరణించిన వారి అంత్యక్రియలను గౌరవప్రదమైన రీతిలో జరపాలన్నారు. జిల్లాలోని రెవెన్యూ, వైద్య, పంచాయతీరాజ్ శాఖ అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
కరోనాతో మరణించిన వారి కుటుంబ సభ్యులు, బంధువులు సహకరించని పక్షంలో అధికారులే గౌరవంగా అంత్యక్రియలు నిర్వహించాలన్నారు. శవాన్ని పూర్తిగా కవర్ చేయాలని, అంత్యక్రియలు నిర్వహించడానికి నలుగురికి పీపీఈ కిట్లు సరఫరా చేయాలని వైద్యాధికారులకు సూచించారు. రెవిన్యూ డివిజన్లలో ఆర్డీవోలు, మున్సిపల్ కమిషనర్లలో కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు.