కరోనా ఆపత్కాలంలో అందరి కంటే ముందుండి ప్రజలకు అవగాహన కల్పిస్తున్న విలేకరులకు నిజామాబాద్ నగర కాంగ్రెస్ నాయకులు శానిటైజర్లు, మాస్కులు పంపిణీ చేశారు. ఓ వైపు మహమ్మారి విజృంభిస్తున్నా.. ధైర్యం చేసి ప్రజలకు కరోనాపై కచ్చితమైన సమాచారాన్ని అందిస్తోన్న జర్నలిస్టులను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి అభినందించారు.
జర్నలిస్టులకు మాస్కులు పంపిణీ చేసిన నిజామాబాద్ కాంగ్రెస్ నేతలు - nizamabad congress leaders distributed masks to journalists
కరోనా వంటి కష్టకాలంలోనూ విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టులు మహమ్మారి బారిన పడకుండా ఉండటానికి నిజామాబాద్ కాంగ్రెస్ నాయకులు శానిటైజర్లు, మాస్కులు అందజేశారు.
![జర్నలిస్టులకు మాస్కులు పంపిణీ చేసిన నిజామాబాద్ కాంగ్రెస్ నేతలు nizamabad congress leaders distributed masks to reporters](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8554114-405-8554114-1598362313843.jpg)
జర్నలిస్టులకు మాస్కులు పంపిణీ చేసిన నిజామాబాద్ కాంగ్రెస్ నేతలు
ప్రజలంతా స్వీయ నియంత్రణ పాటిస్తూ కరోనా మహమ్మారి నుంచి రక్షణ పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కేశ వేణు, ఇంఛార్జ్ తాహెర్బిన్ హందాన్, జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు ముప్ప గంగారెడ్డి పాల్గొన్నారు.
- ఇవీ చూడండి:కృష్ణా బేసిన్లో నిండు కుండల్లా జలాశయాలు