తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రాజెక్టులకై కాంగ్రెస్ నేతల పాదయాత్ర - ప్రాజెక్టులకై కాంగ్రెస్ నేతల పాదయాత్ర

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో తెరాస ప్రభుత్వం వ్యవరిస్తున్న నిర్లక్ష్య ధోరణి పట్ల కాంగ్రెస్ నేతలు షబ్బీర్ అలీ, సుదర్శన్ రెడ్డిలు అసంతృప్తిని వ్యక్తం చేశారు. నవంబర్​లో పాదయాత్ర చేస్తామని స్పష్టం చేశారు.

ప్రాజెక్టులకై కాంగ్రెస్ నేతల పాదయాత్ర

By

Published : Aug 28, 2019, 5:09 PM IST

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టు కింద చేపట్టిన పనులకు వెంటనే నిధులు విడుదల చేయాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. ఈ ప్రాజెక్టు కింద చేపట్టిన ప్యాకేజ్ 20, 21, 22 పనుల కోసం నిధులు విడుదల చేయకపోవడం వల్ల పనులు ముందుకు సాగడం లేదని విమర్శించారు. వచ్చే బడ్జెట్ సమావేశాల్లో కేటాయింపులు చేయాలని కోరారు. అలాగే ఈ ప్యాకేజ్ పనుల పరిశీలన కోసం వచ్చే నవంబర్​లో పాదయాత్ర చేస్తామని షబ్బీర్ అలీ ప్రకటించారు. ప్రాజెక్టుల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న నిర్లక్ష్య ధోరణి పట్ల కాంగ్రెస్ నేత సుదర్శన్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు.

ప్రాజెక్టులకై కాంగ్రెస్ నేతల పాదయాత్ర

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details