లాక్డౌన్ నిబంధనలు అందరూ పాటించే విధంగా అధికారులు పని చేయాలన్నారు నిజామాబాద్ జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి. బోధన్ మండలం సాలుర చెక్పోస్ట్ను పరిశీలించి... భారీ పోలీస్ బందోబస్తుతో లాక్డౌన్ను కఠినంగా అమలు చేయాలని ఆదేశించారు. మహారాష్ట్ర ,ఆంధ్రప్రదేశ్,గుజరాత్ రాష్ట్రాలకు చెందిన వాహనాలు ఎట్టిపరిస్థితుల్లోనూ జిల్లాలోకి అనుమతించరాదని స్పష్టం చేశారు.
'సరిహద్దుల వద్ద లాక్డౌన్ కఠినంగా అమలు చేయాలి' - nizamabad collector visit salura checkpost
నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం సాలుర అంతర్రాష్ట్ర చెక్పోస్ట్ను జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి పరిశీలించారు. ఇతర జిల్లాల నుంచి వచ్చే వాహనాలకు... ఆయా జిల్లాల కలెక్టర్ల అనుమతి పత్రం ఉంటేనే అనుమతించాలన్నారు.
!['సరిహద్దుల వద్ద లాక్డౌన్ కఠినంగా అమలు చేయాలి' nizamabad district latest news](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7069387-436-7069387-1588672852158.jpg)
nizamabad district latest news
వ్యవసాయనికి సంబంధించిన మరియు నిత్యావసర సరకులు తీసుకోచ్చే వాహనాలను పరిశీలించి అనుమతించాలన్నారు. విధుల్లో ఉండే అధికారులు, పోలీసులు, వైద్య సిబ్బంది తప్పనిసరిగా మాస్కులు, సానిటైజర్లు వాడాలని సూచించారు.