నిజామాబాద్ జిల్లా మెండోరా మండలంలో పాలనాధికారి సి.నారాయణరెడ్డి విస్తృతంగా పర్యటించారు. మొదటగా మెండోరా మండల కేంద్రంలో పర్యటించి.. రైతు వేదిక, ప్రకృతి వనం, వైకుంఠధామం నిర్మాణ పనులను పర్యవేక్షించారు. పార్కులు, వైకుంఠ ధామాలు... మిగతా గ్రామాలకు ఆదర్శంగా ఉండేలా తీర్చిదిద్దాలని కలెక్టర్ సూచించారు.
మెండోరా మండలంలో కలెక్టర్ విస్తృత పర్యటన - nizamabad news
నిజామాబాద్ జిల్లా మెండోరా మండలంలో కలెక్టర్ సి.నారాయణరెడ్డి పర్యటించారు. ఆయా గ్రామాల్లో చేపట్టిన వైకుంఠధామం, రైతుల వేదిక భవనాలు, ప్రకృతి వనాలను పరిశీలించారు. నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు.
![మెండోరా మండలంలో కలెక్టర్ విస్తృత పర్యటన nizamabad collector narayanareddy visited in medora mandal](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8676259-150-8676259-1599212171258.jpg)
nizamabad collector narayanareddy visited in medora mandal
అనంతరం బుస్సాపూర్ గ్రామంలోని రైతు వేదిక నిర్మాణం 15 రోజులలో పూర్తి చేయాలని గుత్తేదారుకు సూచించారు. పార్కు కోసం స్థలసేకరణ పూర్తి చేసి నిర్మాణం చేపట్టాలని అధికారులను ఆదేశించారు.