నిజామాబాద్ బల్దియా 2021-22 ఆర్థిక సంవత్సరానికి సాధారణ అంచనా బడ్జెట్ రూ.390.92 కోట్లకు ఆమోదించారు. నగర పాలక సంస్థ బడ్జెట్ సమావేశం మేయర్ నీతూ కిరణ్ అధ్యక్షతన శుక్రవారం జరిగింది. ఖర్చులు, రాబడి ఇతర విషయాలపై చర్చించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్సీలు ఆకుల లలిత, వీజీ.గౌడ్, ఎమ్మెల్యేలు గణేశ్గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్, డిప్యూటీ మేయర్ ఇద్రిస్ ఖాన్, కమిషనర్ జితేష్.వి.పాటిల్ హాజరయ్యారు.
భాజపా కౌన్సిలర్ల ఆందోళన..
మరోవైపు నిధుల కేటాయింపుపై భాజపా కౌన్సిలర్లు నిరసన వ్యక్తం చేశారు. తెరాస, ఎంఐఎం సభ్యుల డివిజన్లకు రూ.10 లక్షలు కేటాయించారు... భాజపా సభ్యుల డివిజన్లలో రూ.5 లక్షలే కేటాయించడం దారుణమని సభ్యులు న్యాలం రాజు, మల్లేశ్ యాదవ్ ప్రశ్నించారు. ఎమ్మెల్యే గణేశ్గుప్తా జోక్యం చేసుకొని అన్ని డివిజన్లకు సమానంగా రూ.10 లక్షల చొప్పున కేటాయిస్తామన్నారు.