తెలంగాణ

telangana

ETV Bharat / state

'మత్స్యశాఖ మంత్రికి గంగపుత్రుల కులవృత్తి ఏమిటో తెలియదా?'

మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ గంగపుత్రుల కుల వృత్తిని ఇతరులకు ఎందుకు ధారాదత్తం చేస్తున్నారో చెప్పాలని నిజామాబాద్ నగర గంగపుత్ర సంఘం అధ్యక్షుడు పల్లికొండ అన్నయ్య గంగపుత్ర ప్రశ్నించారు. చేపలు పట్టడం ముదిరాజ్​ల వృత్తేనన్న మంత్రి వ్యాఖ్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు.

By

Published : Jan 13, 2021, 7:23 PM IST

Updated : Jan 14, 2021, 11:09 PM IST

nijamabad gangaputra committee demond for  minister talasani srinivas yadav should be removed from minister Position
'తలసానిని పదవి నుంచి బర్తరఫ్​ చేయాలి'

రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ను వెంటనే మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని నిజామాబాద్ నగర గంగపుత్ర సంఘం అధ్యక్షుడు పల్లికొండ అన్నయ్య గంగపుత్ర డిమాండ్​ చేశారు. చేపలు పట్టడం ముదిరాజ్​ల వృత్తేనన్న మంత్రి వ్యాఖ్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు.

తమ హక్కుల సాధనకు గంగపుత్రులు ఏకం కావాలని అన్నయ్య పిలుపునిచ్చారు. మత్స్య శాఖ మంత్రికి గంగపుత్రుల కుల వృత్తి ఏమిటో తెలియనప్పుడు ఎమ్మెల్యే ముఠా గోపాల్​కు ఆ బాధ్యత అప్పగించి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్​ చేశారు. తమ కుల వృత్తిని ఇతరులకు ఎందుకు ధారాదత్తం చేస్తున్నారో చెప్పాలంటూ ప్రశ్నించారు. వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని లేనిపక్షంలో హైదరాబాద్​లో ఉన్న 10 లక్షల మంది గంగపుత్రులంతా కలిసి మంత్రి ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నగర గంగపుత్ర సంఘం కార్యనిర్వహక అధ్యక్షుడు వినోద్ గంగపుత్ర, ఉపాధ్యక్షుడు జుంబర్తి రాంచందర్ తదితరులు పాల్గొన్నారు.

'తలసానిని పదవి నుంచి బర్తరఫ్​ చేయాలి'

ఇదీ చదవండి:భాజపా.. మతం పేరుతో రెచ్చగొడుతోంది: మంత్రి ఎర్రబెల్లి

Last Updated : Jan 14, 2021, 11:09 PM IST

ABOUT THE AUTHOR

...view details