నిజామాబాద్ నగరంలోని ఎల్లమ్మగుట్టలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ మేయర్ నీతూ కిరణ్ పాల్గొన్నారు. స్థానిక మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు.
'కరోనా మహమ్మారి నుంచి ప్రజల్ని కాపాడు తల్లీ!' - Navaratri celebrations in Nizamabad
కరోనా మహమ్మారి నుంచి కాపాడాలంటూ నిజామాబాద్ మేయర్ నీతూకిరణ్ దుర్గామాతను వేడుకున్నారు. నగరంలోని ఎల్లమ్మ గుట్ట ప్రాంతంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు.
!['కరోనా మహమ్మారి నుంచి ప్రజల్ని కాపాడు తల్లీ!' Navaratri celebrations in Nizamabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9268043-234-9268043-1603348487089.jpg)
నిజామాబాద్ మేయర్ నీతూకిరణ్
అనంతరం దుర్గామాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కరోనా మహమ్మారి, వరద ముప్పుల నుంచి రాష్ట్ర ప్రజలను కాపాడాలని కోరుకున్నారు. ప్రతిఏటా ఘనంగా నిర్వహించుకునే బతుకమ్మ పండుగను.. కరోనా వ్యాప్తి వల్ల ఈ ఏడాది నిబంధనలు పాటిస్తూ జరుపుకోవాలని సూచించారు.