తెలంగాణ

telangana

By

Published : Jul 25, 2020, 5:44 PM IST

Updated : Jul 25, 2020, 7:03 PM IST

ETV Bharat / state

నిరాడంబరంగా నాగులపంచమి వేడుకలు

కరోనా నేపథ్యంలో నాగుల పంచమి వేడుకులు నిజామాబాద్​లో నిరాడంబరంగా జరిగాయి. నాగశేష ఆలయంలో భక్తులు నాగదేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

nagula panchami festival celebrations in nizamabad
నిరాడంబరంగా నాగులపంచమి వేడుకల

నాగుల పంచమిని నిజామాబాద్ జిల్లాలో భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ప్రతి సంవత్సరం శ్రావణమాసం శుద్ధ పంచమి రోజును నాగ పంచమి, గరుడ పంచమిగా పిలుస్తారు. మహిళలు నాగపంచమి పురస్కరించుకొని పుట్టలో పాలు పోసి నాగదేవతను పూజించారు.

సంతాన సాఫల్యం కోసం, కుటుంబ సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుతూ మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని నాగశేష మందిరంలో భక్తులు ఘనంగా నాగుల పంచమిని జరుపుకున్నారు. కొవిడ్ నేపథ్యంలో అత్యంత నిరాడంబరంగా నాగపంచమి వేడుకలు జరిగాయి.

ఇవీ చూడండి:రాష్ట్రంలో అంతకంతకూ విజృంభిస్తున్న కరోనా..

Last Updated : Jul 25, 2020, 7:03 PM IST

ABOUT THE AUTHOR

...view details