తెలంగాణ

telangana

ETV Bharat / state

జీతాలు ఇవ్వట్లేదని మున్సిపల్​ కార్మికుల ధర్నా

మూడు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని బోధన్​లో మున్సిపల్​ కార్మికులు ధర్నా చేశారు. సాంకేతిక లోపాల కారణంగా ఖాతాలో జమకాలేదని, వెంటనే ఈ సమస్యను పరిష్కరిస్తామని మున్సిపల్​ కమిషనర్​ హామీ ఇవ్వటంతో ఆందోళన విరమించారు.

By

Published : Apr 17, 2019, 11:44 AM IST

జీతాలు ఇవ్వట్లేదని మున్సిపల్​ కార్మికుల ధర్నా

జీతాలు ఇవ్వట్లేదని మున్సిపల్​ కార్మికుల ధర్నా

నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో మున్సిపల్ కార్మికులు ధర్నా చేశారు. మూడు నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదని ఆందోళన చేపట్టారు. మున్సిపల్ కమిషనర్ స్వామి నాయక్​ని వివరణ కోరగా.. నెల ముందే చెక్కులపై సంతకాలు చేసి ఇచ్చామని తెలిపారు. సాంకేతిక లోపాల కారణంగా ఖాతాల్లో నగదు జమ కాలేదని వివరించారు. కొద్దిరోజుల్లో వారికి జీతాలు అందేలా చూస్తామని హామీ ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details