నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో మున్సిపల్ కార్మికులు ధర్నా చేశారు. మూడు నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదని ఆందోళన చేపట్టారు. మున్సిపల్ కమిషనర్ స్వామి నాయక్ని వివరణ కోరగా.. నెల ముందే చెక్కులపై సంతకాలు చేసి ఇచ్చామని తెలిపారు. సాంకేతిక లోపాల కారణంగా ఖాతాల్లో నగదు జమ కాలేదని వివరించారు. కొద్దిరోజుల్లో వారికి జీతాలు అందేలా చూస్తామని హామీ ఇచ్చారు.
జీతాలు ఇవ్వట్లేదని మున్సిపల్ కార్మికుల ధర్నా
మూడు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని బోధన్లో మున్సిపల్ కార్మికులు ధర్నా చేశారు. సాంకేతిక లోపాల కారణంగా ఖాతాలో జమకాలేదని, వెంటనే ఈ సమస్యను పరిష్కరిస్తామని మున్సిపల్ కమిషనర్ హామీ ఇవ్వటంతో ఆందోళన విరమించారు.
జీతాలు ఇవ్వట్లేదని మున్సిపల్ కార్మికుల ధర్నా