తెలంగాణ

telangana

ETV Bharat / state

వారిపై రాజద్రోహం కేసు పెట్టాలి: మందకృష్ణ

రాజ్యాంగాన్ని రచించిన అంబేడ్కర్ మహానీయుడి ఇంటికి రక్షణ కరవైందన్నారు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో అంబేడ్కర్ విగ్రహానికి ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు.

By

Published : Jul 19, 2020, 5:21 PM IST

వారిపై రాజద్రోహం కేసు పెట్టాలి: మందకృష్ణ
వారిపై రాజద్రోహం కేసు పెట్టాలి: మందకృష్ణ

ముంబయిలోని అంబేడ్కర్ రాజాగృహపై దాడి చేసిన వారిపై రాజద్రోహం, ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రాజ్యాంగాన్ని రచించిన మహనీయుడి ఇంటికి రక్షణ కరవైందన్నారు. ఆయనతో సమానంగా ఉన్న వారి కుటుంబాలకు రక్షణ కల్పిస్తున్న ప్రభుత్వాలు... అంబేడ్కర్ ఇంటికి రక్షణ కల్పించకపోడం విడ్డూరంగా ఉందన్నారు. మహారాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు స్పందించి చర్యలు తీసుకోవాలని, రాజాగృహకు రక్షణ కల్పించాలని ఆయన కోరారు.

దాడికి నిరసనగా రేపటి నుంచి జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు మైలారం బాలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details