తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆర్టీసీ సమ్మె తెరాస పతనానికి నాంది: ఎంపీ ధర్మపురి - MP Dharmapuri Arvind criticizes Chief Minister KCR

రాష్ట్రంలో పాలన స్తంభించిపోయిందని ఎంపీ ధర్మపురి అర్వింద్​ ఆరోపించారు. ముఖ్యమంత్రి నిర్ణయాలతో ఆర్టీసీ కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆర్టీసీ సమ్మె తెరాస పతనానికి నాంది: ఎంపీ ధర్మపురి

By

Published : Nov 5, 2019, 7:24 PM IST

ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా 50 వేల మంది కార్మికుల జీవితాలతో ముఖ్యమంత్రి కేసీఆర్​ ఆటలాడుతున్నారని నిజామాబాద్​ ఎంపీ ధర్మపురి అర్వింద్​ ఆరోపించారు. నియంత ప్రభుత్వ పాలనకు చరమగీతం పాడేందుకు.. ముఖ్యమంత్రి కేసీఆర్​ను గద్దె దించేందుకు ప్రజలు సన్నద్ధం కావాలని సూచించారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని లేకుంటే మాజీ ఎంపీ కవితకు పట్టిన పరిస్థితే వస్తుందని హెచ్చరించారు. ఇకనైనా ఫామ్​హౌజ్​ను వదిలి బయటకు రావాలన్నారు.

ఆర్టీసీ సమ్మె తెరాస పతనానికి నాంది: ఎంపీ ధర్మపురి
ఇదీ చూడండి: ఎడ్ల బండిని ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details