తెలంగాణ

telangana

ETV Bharat / state

'పసుపు పంటతో ఇందూరు కళకళ'

పసుపు రైతులకు ఇక నుంచి మంచి రోజులు వచ్చినట్లేనని భాజపా ఎంపీ ధర్మపురి అర్వింద్ పేర్కొన్నారు. నిజామాబాద్​లోని పసుపు మార్కెట్​ను ఆయన సందర్శించారు.

By

Published : Mar 5, 2021, 5:55 PM IST

mp-dharmapuri-aravind-visited-the-turmeric-market-in-nizamabad
'ఇందూరు.. పసుపు పంటతో కళకళలాడుతోంది'

పసుపుకు మంచి ధర రావడం ఎంతో సంతోషాన్నిచ్చిందని భాజపా ఎంపీ ధర్మపురి అర్వింద్ తెలిపారు. నిజామాబాద్​లోని పసుపు మార్కెట్​ను ఆయన సందర్శించారు. ఇందూరు పసుపు పంటతో కళకళలాడుతోందన్నారు.

మోదీ విధానాల వల్ల పసుపునకు మంచి ధర లభిస్తోందని ఎంపీ కొనియాడారు. విదేశాల నుంచి దిగుమతి ఆపేసి.. ఎగుమతులు ప్రారంభించగలిగామని వివరించారు. ధర 20 వేలకు పైగా పలుకుతోందన్నారు.

ఇదీ చదవండి:కరెంట్​ పోతోంది... జనరేటర్​ ఇవ్వండి: జీహెచ్​ఎంసీ మేయర్​

ABOUT THE AUTHOR

...view details