ఎమ్మెల్సీ కవిత మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన ఓ వీడియో జర్నలిస్టు వైద్యం కోసం ఆర్థిక సాయం చేయడానికి ముందుకొచ్చారు. ఓ మీడియా సంస్థలో కెమెరామెన్గా పనిచేస్తున్న కల్యాణ్ అనే యువకుడు రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న కవిత అర్థిక సాయం చేశారు. ఆమె ఆదేశాలతో బాధితుడి కుటుంబసభ్యులకు తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడు అవంతి రావు రూ.50వేల నగదు అందజేశారు.
మరోసారి పెద్దమనసు చాటుకున్న కవిత... జర్నలిస్టుకు ఆర్థిక సాయం - తెలంగాణ లేటెస్ట్ అప్డేట్స్
ఎమ్మెల్సీ కవిత మరోసారి తన సేవాగుణాన్ని చాటుకున్నారు. ప్రమాదానికి గురైన ఓ వీడియో జర్నలిస్టు వైద్యం కోసం ఆర్థిక సాయాన్ని అందజేశారు. బాధితుడి కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
మరోసారి పెద్దమనసు చాటుకున్న కవిత... జర్నలిస్టుకు ఆర్థిక సాయం
ఈ ఆర్థిక సాయంతో పాటు సీఎంఆర్ఎఫ్ నుంచి సాయం అందజేస్తామని ఆయన తెలిపారు. బాధితుడికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు. కల్యాణ్ కుటుంబానికి కవిత అండగా ఉంటారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జగృతి నాయకులు నవీన్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:మా మౌనాన్ని బలహీనతగా భావించొద్దు: కేటీఆర్
Last Updated : Mar 6, 2021, 6:46 PM IST