తెలంగాణ

telangana

ETV Bharat / state

నిజామాబాద్​ రెడ్​జోన్​లో ఎమ్మెల్యే గణేశ్​ గుప్తా పర్యటన - CORONA RED ZONES

కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రజలంతా ధైర్యంగా ఉండి సహకరించాలని ఎమ్మెల్యే గణేశ్​గుప్తా సూచించారు. నిజామాబాద్​లో ప్రకటించిన రెడ్​జోన్​లో పర్యటించి ప్రజలకు భరోసానిచ్చారు.

MLA GANESH GUPTHA VISITED IN NIZAMABAD RED ZONE AREA
నిజామాబాద్​ రెడ్​జోన్​లో ఎమ్మెల్యే గణేశ్​ గుప్తా పర్యటన

By

Published : Apr 23, 2020, 7:49 PM IST

నిజామాబాద్​లో రెడ్​జోన్ ప్రాంతాల్లో ఎమ్మెల్యే గణేశ్​ గుప్తా పర్యటించారు. నాందేవ్​వాడలో ప్రజలతో ముచ్చటించారు. ఇబ్బందులేమైనా ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని... అధికారులు బాగా పనిచేస్తున్నారని భరోసా ఇచ్చారు.

కాలనీలో ఇప్పటి వరకు ఎవ్వరికీ కరోనా పాజిటివ్ రాలేదని... అయినప్పటికీ స్థానికులంతా ఇళ్లలోనే ఉండి జాగ్రత్తలు పాటించాలని ఎమ్మెల్యే సూచించారు. అవసరమైతే తప్ప బయటకి రావద్దన్నారు. ప్రభుత్వ నియమాలు పాటించి కరోనాను తరిమికొడదామని సూచించారు.

ఇదీ చూడండి:-కరోనా చికిత్సకు ఆ మందు వాడితే ప్రాణాలు హరీ!

ABOUT THE AUTHOR

...view details