తెలంగాణ

telangana

ETV Bharat / state

పల్లె ప్రగతిలో అధికారుల నిర్లక్ష్యంపై మంత్రి ఆగ్రహం - minister Vemula prashanth reddy review on Palle pragathi in Nizamabad district

నిజామాబాద్​ జిల్లాలో మొదటి విడతలో అధికారుల నిర్లక్ష్యంపై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆగ్రహాం వ్యక్తం చేశారు. రెండో విడత పల్లె ప్రగతిలో చేపట్టాల్సిన పనులపై చర్చించి పలు సూచనలు చేశారు. దీనిని సీరియస్​గా తీసుకోవాలని ఆదేశించారు.

minister Vemula prashanth reddy review on Palle pragathi in Nizamabad district
మొదటి విడత పల్లె ప్రగతిపై మంత్రి ఆగ్రహం

By

Published : Dec 22, 2019, 11:46 PM IST

పల్లె ప్రగతి కార్యక్రమాన్ని అధికారులు సీరియస్​గా తీసుకోవాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆదేశించారు. నిజామాబాద్ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో పల్లె ప్రగతిపై అధికారులతో మంత్రి సమీక్షించారు. జిల్లా పరిషత్ ఛైర్మన్ దాదన్నగారి విఠల్ రావు, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్సీలు వీజీ గౌడ్, ఆకుల లలిత, జిల్లా అధికారులు హాజరయ్యారు.

రెండో విడత పల్లె ప్రగతిలో చేపట్టాల్సిన పనులపై అధికారులతో చర్చించి పలు సూచనలు చేశారు. శాఖల వారీగా సమీక్ష నిర్వహించారు. మొదటి విడతలో చేపట్టిన వైకుంఠ దామాలు, డంపింగ్ యార్డుల పురోగతిపై అధికారులు ఇచ్చిన వివరాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండో విడత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని సీరియస్​గా తీసుకోవాలని ఆదేశించారు.

పల్లె ప్రగతిలో అధికారుల నిర్లక్ష్యంపై మంత్రి ఆగ్రహం

ఇదీ చూడండి: నేడు రాజ్​భవన్​లో రాష్ట్రపతికి విందు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details