తెలంగాణ

telangana

ETV Bharat / state

'జిల్లాలోని అన్ని ఆస్పత్రుల బెడ్స్​ వివరాలు ఆన్​లైన్​లో ఉంచాలి'

నిజామాబాద్ జిల్లాలో కరోనా వ్యాప్తి నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి.. అధికారులతో సెల్​ కాన్ఫరెన్స్​ ద్వారా సమీక్షించారు. జిల్లాలోని అన్ని ఆస్పత్రుల్లో కొవిడ్ సేవలకు సంబంధించిన వివరాలను వెబ్​సైట్​లో పొందుపరచాలని సూచించారు. కరోనా పరీక్షలు, వ్యాక్సినేషన్​పై అధికారులకు పలు సూచనలు చేశారు. ​

By

Published : Apr 25, 2021, 7:40 PM IST

minister vemula meeting with nizamabad officials
నిజామాబాద్​ అధికారులతో మంత్రి వేముల సమావేశం

నిజామాబాద్​ జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో కొవిడ్​ సేవల వివరాలను ఎప్పటికప్పుడూ ఆన్​లైన్​లో ఉంచాలని అధికారులను మంత్రి వేముల ప్రశాంత్​ రెడ్డి ఆదేశించారు. కలెక్టర్​, వైద్యాఆరోగ్య శాఖ, సంబంధిత అధికారులతో సెల్​ కాన్ఫరెన్స్​ ద్వారా ఆయన సమీక్ష నిర్వహించారు. పలు విషయాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.

ఎప్పటికప్పుడు పర్యవేక్షణ

కరోనాపై సీఎం కేసీఆర్​ ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ అవసరమైన ఆదేశాలు జారీ చేస్తున్నారని మంత్రి అన్నారు. ప్రజలను కాపాడుకోవడానికి ఎంత ఖర్చయినా భరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. కరోనా పరీక్షల నిర్వహణలో నిజామాబాద్, బోధన్, ఆర్మూర్​లో 2,625 లక్ష్యమైతే అంతకు రెట్టింపు స్థాయిలో పరీక్షలు నిర్వహిస్తున్నారని ప్రశంసించారు. వ్యాక్సినేషన్ కూడా లక్ష్యానికి అనుగుణంగా జరుగుతోందన్నారు.

గోప్యంగా ఉంచితే లైసెన్సులు రద్దు

ప్రజలకు పడకల వివరాలు తెలియజేయడానికి ప్రతి 4 గంటలకొకసారి ఆస్పత్రుల వారీగా వివరాలను ఆన్​లైన్​లో నమోదు చేయాలని చెప్పారు. ఈ వివరాలను సరిచూడడానికి అధికారులు ఆకస్మిక తనిఖీలు చేయాలని.. ఎవరైనా వివరాలను దాచినట్లయితే ఆ ఆస్పత్రుల లైసెన్సులు రద్దు చేయాలని సూచించారు. సమావేశంలో సీపీ కార్తికేయ, మున్సిపల్ కమిషనర్ జితేష్ వి పాటిల్, ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రతిమారాజ్, డీఎంహెచ్​ఓ బాల నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:వైద్య, ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వ అనుమతి

ABOUT THE AUTHOR

...view details