నిజామాబాద్ జిల్లా బాల్కొండలో మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి పర్యటించారు. గ్రామంలో రూ. 9 కోట్లతో చేపడుతున్న పలు రోడ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. గ్రామంలో పర్యటించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై భాజపా నేతలు అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. పేదలకు అందజేస్తున్న పింఛన్ సొమ్ములో కేంద్రం వాటా రూ.1,800 ఉందని నిరూపిస్తే తాను రాజీనామా చేస్తానని.. లేకపోతే ఎంపీ అర్వింద్ రాజీనామా చేస్తారా...? అని సవాల్ విసిరారు.
'భాజపా నేతలు అసత్య ప్రచారాలు చేయడం మానుకోవాలి' - భాజపా నేతలపై మంత్రి వేముల ఆరోపణలు
నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామస్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు... పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
'భాజపా నేతలు అసత్య ప్రచారాలు చేయడం మానుకోవాలి'
రెండు పడకగదుల ఇళ్ల నిర్మాణాల్లో కేంద్రం వాటా కేవలం రూ.72 వేలు మాత్రమేనని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు నీరందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందని అన్నారు. భాజపా నేతలు సీఎం కేసీఆర్ను ఏకవచనంతో సంభోదించడం మానుకోవాలని సూచించారు.